ఏపిలోని పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు కాకినాడ పర్యటనలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగింది. దీనిపై అధికారులు కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి జగ్గ్గంపేట బస్టాండ్ సెంటర్ లో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభ జరిగింది. బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా, అక్కడే ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆవిష్కరించి దండ వేసి నివాళులర్పించారు.
ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుండటంతో ఎన్నికల పరిశీలకుల ఫిర్యాదు మేరకు టీడీపీ నేత నవీన్ పై జగ్గంపేట పోలీస్ స్టేషన్ లో 188 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. చంద్రబాబు నిన్నటి నుండి ఆ జిల్లాలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటించనున్నారు.
Breaking: బీజేపీకి కన్నా రాజీనామా .. ఏపి పార్టీ నాయకత్వంపై కీలక వ్యాఖ్యలు..ట్విస్ట్ ఏమిటంటే..?