Visakha : గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ (జీవిఎంసీ) GVMC టీడీపీ మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావును ఆ పార్టీ అధినేత చంద్రబాబు Chandra babu ప్రకటించారు. జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖలోని పెందుర్తి కూడలిలో ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తమ విజయాన్ని అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదని అన్నారు. ఎన్నికల్లో టీడీపీకి బ్రహ్మండమైన గెలుపును అందించాలని ప్రజలను కోరారు. విశాఖపట్టనాన్ని ఆర్థిక రాజధానిగా చేయాలని తాను ఎంతో కృషి చేశానని పేర్కొన్నారు. విశాఖకు పట్టిన ఏ 2 శనిని వదిలించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. విశాఖను అభివృద్ది చేసే శక్తి సామర్థ్యం టీడీపీకే ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.
కాగా చంద్రబాబు పర్యటిస్తున్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఎన్ ఏ డీ కొత్త రోడ్డు ప్రాంతంలో వీధి దీపాలు వెలగకపోవడంతో రోడ్డు చీకటిమయంగా మారింది. విశాఖలో చంద్రబాబు రెండు రోజుల పాటు ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సాయంత్రం పెందుర్తి నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన చంద్రబాబు అక్కడ నుండి చీనముషిడివాడ, వేపగుంట, గోపాలపట్నం, ఎన్ ఏడీ, మర్రిపాలెం, కంచరపాలెం, తాటిచెట్లపాలెం మీదుగా అక్కయ్యపాలెం వరకూ రోడ్డుషో నిర్వహించనున్నారు. రాత్రికి పార్టీ కార్యాలయంలో బస చేసి తిరిగ శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకూ జీవీఎంసీ పరిధిలో ప్రచారం నిర్వహించనున్నారు. చంద్రబాబు వెంట పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు తదితర నేతలు పాల్గొన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?