Visakha Steel plant : ఏ రాజకీయ పార్టీలో ఆ పార్టీలో చక్రం తిప్పుతూ తనదైన శైలి రాజకీయం చేసే మాజీ మంత్రి, విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు Ganta srinivasa rao దాదాపు రెండేళ్లుగా మౌనంగా ఉండిపోయారు. ఆయన రాజకీయ క్యారీర్ ప్రారంభించిన తరువాత ఇనాళ్ల పాటు సైలెంట్ గా ఉండింది లేదు. టీడీపీ ఘోర పరాజయం తరువాత అధికార వైసీపీ లో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభినా అవి ఫలించలేదు. సమయం కోసం వేచి చూస్తూ ఉండేపోయారు. ఈ తరుణంలోనే ఓ మంచి అవకాశం వచ్చింది. దాన్ని అందిపుచ్చుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేట్ పరం చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోవడం విశాఖ వాసులతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలను తీవ్ర ఆందోళన కల్గించింది. దీనిపై ప్రజా సంఘాలు, వామపక్షాలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రజల సెంటిమెంట్ తో ముడిపడి ఉండి. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో పోరాటం సాగించి ఎందరో త్యాగాల ఫలితంగా ఈ కర్మాగారం ఏర్పాటు అయ్యింది. దీంతో మాస్టర్ ప్లాంట్ తో గంటా శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు రాజకీయాలకు అతీతంగా సంఘటిత ఉద్యమం చేస్తేనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను అడ్డుకోవచ్చని భావించారు. అందకు ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తడి తీసుకురావాలని పిలుపు నిచ్చారు. తాను అన్నట్లుగానే ఎమ్మెల్యే పదవికి రాజీమానా చేసి లేఖను స్పీకర్ కు పంపారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా జేఏసి ఏర్పాటుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
గంటా రాజీనామాతో చేసిన 12 గంటల్లోపే ఊహించని సీన్ ఆవిష్కృతమైంది. ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దీనిపై స్పందిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాయడం గమనార్హం. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పునరాలోచన చేయాలంటూ లేఖలో జగన్ కోరారు. నిన్నటి వరకూ విశాఖ ఉక్కు పరిశ్రమపై వైసీపీ స్టాండ్ ఏమిటో తెలియక ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు సైలెంట్ గా ఉండిపోయారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంలో ఆ పార్టీ నాయకులు మద్దతుగా పాల్గొనే అవకాశం ఏర్పడింది.