నౌకాదళ దినోత్సవం (నేవీ డే) సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ లో నౌకాదళ విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిధిగా హజరై విన్యాసాలు తెలకించారు. ఐఎఎస్ సింధు వీర్ జలాంతర్గామి ద్వారా రాష్ట్రపతికి త్రివర్ణ బంబర్లతో నౌకాదళం ఘన స్వాగతం పలికింది. యుద్ద విమానాలు ఆకాశంలో వలయాకారంలో తిరుగుతూ విన్యాసాలు చేయడం ఆసక్తి కలిగించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా నావికా దళ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు నేవీడే శుభాకాంక్షలు తెలియజేశారు.
1971లో పాకిస్థాన్ తో జరిగిన యుద్దంలో భారత్ విజయం సాధించగా, ఈ ఘటనలో విశాఖ నేవీ స్థావరానికి కూడా కీలక పాత్ర ఉంది. తూర్పు తీరంలో ఉన్న భారత విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను నాశనం చేసేందుకు పాకిస్థాన్ ఘాజీ అనే జలాంతర్గామిని పంపగా, అది లక్ష్యానికి చేరుకోకముందే విశాఖ కు సమీపంలో పెద్ద శబ్దంతో సముద్ర జలాల్లో పేలిపోయింది. అనాని యుద్ద విజయాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా డిసెంబర్ 4 నేవీడే పేరుతో నౌకాదళ విన్యాసాలు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నౌకాధళ చీఫ్ అడ్మిరల్ హరికుమార్, ఏపి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంతులు విడతల రజిని, గుడివాడ అమరనాథ్, క్రీడాకారణి పీవీ సింధు తదితరులు పాల్గొనగా, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ఆలపించిన నౌకాదళ గేయం విశేషంగా ఆకట్టుకుంది. భారీ సంఖ్యలో తరలివచ్చిన సందర్శకులతో ఆర్ కే బీచ్ జనసంద్రమైంది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రత్యేకంగా బహుమతి అందజేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి