Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడుగా ఉన్న దేవిరెడ్డి శివశంకరరెడ్డికి కడప జిల్లా కోర్టులో చుక్కెదురైంది. దేవిరెడ్డి శంకరరెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ ను విచారించిన కడప జిల్లా కోర్టు కొట్టేసింది. కడప సెంట్రల్ జైలులో జ్యూడీషియల్ రిమాండ్ లో ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తనకు జైలులో ప్రత్యేక వసతులకు అనుమతివ్వాలంటూ ఇటీవల కడప జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇప్పటికే పలు మార్లు విచారణ జరిపిన జిల్లా కోర్టు.. తాజాగా గురువారం కూడా విచారణ చేపట్టింది. ఈ సందర్భంలో దేవిరెడ్డికి జైలులో ప్రత్యేక వసతులు అవసరం లేదని సీబీఐ తరుపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు జైలులో ప్రత్యేక వసతులకు నిరాకరిస్తూ ఈ పిటిషన్ ను కొట్టేసింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సాధారణంగా జైలులో ప్రజా ప్రతినిధులకు మాత్రమే కోర్టు అనుమతితో ప్రత్యేక వసతులు కల్పిస్తుంటారు. వివేకా హత్య కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకరరెడ్డి..కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డికి అనుచరుడే కానీ ప్రజా ప్రతినిధి కాదు. వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వ్యాంగ్మూలం ఆధారంగా విచారణ జరిపిన సీబీఐ అధికారులు దేవిరెడ్డి శివశంకరరెడ్డిని అరెస్టు చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.