Viveka Murder Case: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనమైన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ స్పీడ్ పెంచింది. వివేకా కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారిపై ప్రైవేటు కేసు నమోదు కావడం, సీబీఐ అధికారులపైనే అనుమానితుల తరఫువారు ఆరోపణలు చేసిన నేపథ్యంలో సీబీఐ అధికారుల దర్యాప్తు మందగించింది. ఇప్పటికే వివేకా హత్య కేసులో పాలుపంచుకున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన సీబీఐ వారిని జైలుకు పంపింది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన మూడవ నిందితుడు దస్తగిరి ఇచ్చిన వ్యాంగ్మూలం ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ హత్యలో సూత్రధారులు ఎవరు అనేది తెలుసుకుని వారిని అరెస్టు చేసేందుకు అవసరమైన ఆధారాలను సేకరించే పనిలో సీబీఐ అధికారులు ఉన్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Viveka Murder Case: పులివెందులలో సీబీఐ బృందాలు
ఈ క్రమంలోనే రెండు సీబీఐ బృందాలు కడప నుండి పులివెందులకు చేరుకుని పలు ప్రదేశాలను పరిశీలించారు. సీబీఐ అధికారి అంకిత్ యుదవ్ ఆధ్వర్యంలో అధికారుల బృందాలు వివేకా నివాసంతో పాటు ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి పరిసరాలను పరిశీంచాయి. వివేకా ఇంట్లో గతంల కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేసిన ఇనాయతుల్లా ను వెంట బెట్టుకుని పట్టణంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. అతనితో పాటు రెవెన్యూ సర్వేయర్ ను కూడా వెంట బెట్టుకుని సీబీఐ అధికారులు ఆ ప్రాంతాలను పరిశీలించడంతో పాటు ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి పరిసరాల్లో, ఎంపిక చేసుకున్న స్థలాల్లో కొలతలు తీస్తున్నారు.
ఇనాయతుల్లాను వెంట బెట్టుకుని
వివేకా హత్య కేసులో కీలక సమాచారాన్ని రాబట్టేందుకే ఇనాయతుల్లాను వెంట బెట్టుకుని సిబీఐ అధికారులు ఆ ప్రాంతాలను పరిశీలిస్తున్న సమాచారం. గత అయిదు రోజులుగా ఇనాయతుల్లాను సీబీఐ అధికారులు తమ వెంట తిప్పుకుంటున్నారు. వివేకా హత్య జరిగిన రోజున బెడ్ రూమ్, బాత్ రూమ్ లో రక్తపు మడుగులో పడి ఉన్న వివేకా మృతదేహాన్ని ముందుగా ఫోటోలు, వీడియోలు తీసింది ఇనాయతుల్లానే కావడంతో అతను ఆ వీడియోలు, ఫోటోలు ఎవరెవరికి పంపాడనే సమాచారం ఆధారంగా సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.