రుణాల మంజూరుకు సహకరించడం లేదన్న అక్కసుతో మునిసిపల్ కార్మిక సిబ్బంది బ్యాంకుల ముందు చెత్త వేసిన విషయంపై రాష్ట్ర స్థాయిలో తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. కృష్ణా జిల్లా ఉయ్యురు, మచిలీపట్నం, విజయవాడ పరిధిలో పలు బ్యాంకుల ముందు లబ్ధిదారులు, పారిశుధ్య కార్మికులు బ్యాంకుల ముందు చెత్తను వేశారు. దీనిపై వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు..తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి. ఈ ఘటనలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కూడా తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వాన్ని తప్పు పడుతూ విమర్శించారు. దీనిపై రాష్ట్ర స్థాయిలో విమర్శలు వెళువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉయ్యురు నగర పంచాయతీ కమిషనర్ ప్రకాశరావు ఘటనపై విచారం వ్యక్తం చేశారు. పారిశుధ్య సిబ్బంది, లబ్దిదారులు కలిసి బ్యాంకుల ముందు చెత్త వేయడం బాధాకర అంశమని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూస్తామన్నారు. ఈ విషయంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది మనోభావాలు దెబ్బతిని ఉంటే తాను క్షమాపణ కోరుతున్నానని ప్రకాశరావు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకర్లు, నగర పంచాయతీ వర్గాలు సమైక్యంగా ముందుకు వెళ్లేందుకు కృషి చేస్తామని, జరిగిన ఘటనపై అంతర్గత విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు కూడా తీసుకుంటామని కమిషనర్ ప్రకాశరావు తెలిపారు. ఈ వ్యవహారాలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పందించారు.
దీంతో ఈ ఘటనలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ ప్రకాశరావు ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుడివాడ మున్సిపాలిటీ కమిషనర్ కు ఉయ్యురు ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు పురపాలక శాఖ కమిషనర్ విజయకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మరో పక్క మచిలీపట్నం, విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ల కమిషనర్లను నోటీసులు జారీ చేసి వివరణలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?