Neelam Sahni : ఏపీ ఎన్నికల అధికారిగా సీనియర్ బ్యూరోక్రాట్ నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. గురువారం బాధ్యతలు చేపట్టిన ఎస్ఈసీ నీలం సాహ్ని మధ్యలో నిలిచిపోయిన ఎన్నికలను వీలైనంత త్వరగా జరపాలని భావించారు. ఇందులో భాగంగానే కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 8న ఎన్నికల పోలింగ్ నిర్వహించి ఈనెల10న ఫలితాలను ప్రకటించాలని డిసైడయ్యారు. అయితే, ఈ నిర్ణయం ఆధారంగా ఆమెను ఇరకాటంలో పడేయాలని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయని అంటున్నారు.
Neelam Sahni ఆ పార్టీల ససేమిరా…
ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఈ షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు అధికార వైసీపీ మినహా మరే పార్టీ కూడా ఒప్పుకోవడం లేదు. అఖిలపక్ష సమావేశానికి టీడీపీ, జనసేన – బీజేపీ ఇలాంటి కీలక పార్టీలు సైతం గైర్హాజరు అవడం దీనికి నిదర్శనం. మరోపక్క జనసేన దాఖలు చేసిన పిటిషన్ ఒకటి హైకోర్టులో ఇంకా పెండింగ్లోనే ఉంది. దీనిపై నేడు విచారణ జరగాల్సి ఉంది అయినా సరే కొత్త ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇప్పుడు తాజాగా మళ్లీ ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషనర్ జారీ చేసిన కొత్త నోటిఫికేషన్ సవాల్ చేస్తూ వీరు ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు చెబుతున్నారు.
బాబు సంచలన నిర్ణయం…
మరోవైపు ఏపీలో పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఎన్నికలు అప్రజాస్వామికంగా మారాయని బాబు ఆరోపించారు. అక్రమాలు జరిగిన ఎన్నికలనే కొనసాగిస్తున్నారని…..SEC తీరును తప్పు పడుతూ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. బలవంతపు, అక్రమ ఏకగ్రీవాలపై చర్యలు తీసుకోక పోవడాన్ని తప్పు పట్టిన చంద్రబాబు పొలిట్ బ్యూరోలో నిర్ణయం మేరకు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల బహిష్కరణ కఠిన నిర్ణయమే ఐనా తప్పలేదని చంద్రబాబు పేర్కొన్నారు.