NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఎన్నికల గోలలో గెలుపు ఎవరిదీ?? చట్టం చెబుతున్నది ఏమిటి??

 

 

ఎన్నికల గోలలో గెలుపు ఎవరిదీ?? చట్టం చెబుతున్నది ఏమిటి??

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో గెలుపు ఎవరిది..? ఇంతటి పెద్ద ప్రభుత్వం మీద నిమ్మగడ్డ రమేష్ గర్జించు దానికి గల కారణాలు ఏమిటి? తన ఇష్టం వచ్చినట్లు నోటిఫికేషన్లు విడుదల చేసుకోవడంలో ఆంతర్యం ఏముంది? అసలు మొత్తం ఈ ఎపిసోడ్ లో గెలుపు ఎవరిది? భవిష్యత్తులో ఇది ఎంతవరకు వెళ్ళనుంది.. ఏం జరగనుంది? అంటే దీనికి న్యాయ నిపుణులు చెబుతున్న లెక్కల ప్రకారం మాత్రం ఇప్పటివరకు పరిస్థితిని బేరీజు వేసి కోర్టులకు వెళితే మాత్రం ఎన్నికల కమిషన్ కే లీడింగ్ విజయాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఇది కోర్టు మెట్లు వరకు ఎక్కితే రాజ్యాంగ మౌలిక సూత్రాలను లోబడి ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీద విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అనేది న్యాయ నిపుణులు చెబుతున్న మాట. ఎందుకు అంటే ఒక సారి పరిశీలిద్దాం…

 

అధికారణ 243 (కే) చెబుతున్నది అదే!!

రాజ్యాంగంలో ఎన్నికల కమిషన్ కు సర్వస్వతంత్ర తర్వాత ఇవ్వడంతోపాటు వారి విధులు ఏమిటన్నది స్పష్టంగా తెలిపారు అలాగే వారి అధికారాలు ఎలా ఉంటాయి అనేది రాజ్యాంగంలో ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 243 (కే) లో ఇది స్పష్టంగా రాసిపెట్టి ఉంది. స్థానిక సంస్థలను ఆయా రాష్ట్ర గవర్నర్ల చే నియమింపబడిన ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహించాలి. స్థానిక సంస్థల ఎన్నికల తేదీలు నిర్వహణ విషయంలో తుది నిర్ణయం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనేది స్పష్టంగా పేర్కొన్నారు. సర్వ స్వతంత్రత ఉన్న ఎన్నికల కమిషన్ కు ఇది ఒక ప్రత్యేకమైన ఆర్టికల్. అంటే ఇప్పుడు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్యాంగంలోని ఈ మౌలిక ఆదేశాలను బేసిక్ గా తీసుకొని ప్రభుత్వంతో పోరాడుతున్నట్లు అర్థమవుతోంది. ఆయన అందరు న్యాయనిపుణుల సలహా మేరకు మాత్రమే కోర్టులో కేసులను, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు లేఖలు రాస్తున్నారు. దీంతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు రాజ్యానికి జరిగిన వివాదాల్లో గతంలో కర్ణాటకలోనూ అస్సాంలోనూ వచ్చిన తీర్పులను ఒకసారి పరిశీలిస్తే అవి ఎన్నికల కమిషన్ కు అనుకూలంగా వచ్చిన తీర్పులే. రాజ్యాంగంలో ఉన్న మౌలిక లక్షణాలను బట్టి ఎన్నికల కమిషన్ కు ఉన్న అధికారాలను రాజ్యం అడ్డుకోలేదని పలు రాష్ట్రాల హైకోర్టు ఇచ్చిన తీర్పులను ఇక్కడ ఊటంకించవచ్చు. అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఎంతో బలమైన శక్తి కావడంతో దానిలో ఉన్న విషయాలను అర్థం చేసుకున్న తర్వాతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వంతో ఈ పేచీకి దిగినట్లు స్పష్టమవుతోంది.

సుప్రీం ఎం చేస్తుంది అన్నది కీలకం!!

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వానికి సంబంధించిన కేసులో ఇప్పటికే హైకోర్టులో నడుస్తోంది. ఇటీవల హైకోర్టు మధ్య మార్గంగా ముగ్గురు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి ఐఏఎస్ అధికారులను, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వద్దకు పంపించి రాజీ చేయడానికి ప్రయత్నించింది. అయితే అది అంత విజయం సాధించలేకపోవడంతో.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకంగా ఎన్నికల షెడ్యూల్ను ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి లేఖలు రాసి తనకు ఎన్నికలకు జరపడానికి వీలుగా సిబ్బందిని కేటాయించాలని కోరగా రాష్ట్ర ప్రభుత్వం దీనికి ససేమిరా అంటోంది. ఎన్నడూ లేనట్లుగా మంత్రులు ఉద్యోగ సంఘాలు పోలీసులు సైతం తాము ఎన్నికలను బహిష్కరిస్తామని చెప్పడాన్ని చూస్తే ఇది కొత్త వివాదానికి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
** ఒక రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆయా తేదీలను అనుసరించి మేం ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నప్పుడు కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ సిబ్బంది వారికి సహకరించాలి. అలా కాకుండా ఇప్పుడు ఎదురు తిరిగే పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఇది కచ్చితంగా ఎన్నికల కమిషన్ కే ప్లస్ అవుతుంది.


** ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలను అడ్డుకునే వాయిదా వేసే హక్కు లేదు. అధికారంలో ఉన్న పార్టీ తాము గెలవలేము అనుకున్నప్పుడు ఇలాగే ఎన్నికలు వాయిదా వేస్తే మొత్తం రాజ్యాంగ ఉల్లంఘనే జరుగుతుంది. ప్రస్తుతం జగన్మోహన్రెడ్డి గెలవలేం అనే కోణం కంటే తన అహం దెబ్బతినడంతో నే ఎన్నికలను వద్దని, చెబుతున్నారు. అంటే భవిష్యత్తులో మరో రాష్ట్ర ప్రభుత్వం మాకు స్థానిక సంస్థల ఎన్నికలు వద్దు మేము పెట్టడం అంటే అవి కొత్త వివాదాలకు దారి తీసే అవకాశం ఉంది. అంటే ఇది ఇప్పటి తో పోయే సమస్య కాదు. భవిష్యత్తులోనూ ఇతర రాష్ట్రాలకు ఎలాంటి సమస్యలు మార్గనిర్దేశం అవుతాయి కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్లినా ఎన్నికల కమిషన్ తీర్పు వచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
** భారత అత్యున్నత న్యాయస్థానం కోర్టులోకి ఒక కేసు వెళ్లిందంటే దానిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చే తీర్పు భవిష్యత్తులో ఒక కేసును ప్రభావితం చేయవచ్చు. వ్యవస్థలను సైతం ప్రభావితం చేయవచ్చు. అందుకే సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని మాత్రమే ఎలాంటి ఇబ్బంది లేకుండా, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాత్రమే వ్యాఖ్యలు, తీర్పులు ఇస్తుంది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిన రాజ్యాంగంలో ఉన్న అధికారనల మేరకు మాత్రమే తీర్పు రావాలి. అది భవిష్యత్తులో ఇబ్బందులను తీర్చేది తప్ప సృష్టించేది అయి ఉండకూడదు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమాత్రం సంప్రదించకుండా ఎన్నికలను వాయిదా వేయడం ఒక చిన్న పొరపాటు కింద మాత్రమే కోర్టు చూస్తుంది. కానీ ఎన్నికల ఎన్నికల కమిషన్ వీధుల్లో రాష్ట్ర ప్రభుత్వం తలదూర్చి తమకు ఎన్నికలు వద్దు అని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమే. అంటే ఈ కేసులో ఏం జరగబోతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది.

** డబ్బు ఖర్చు తప్ప!!

రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఈ కేసు విషయంలో వెళితే కేవలం ఖర్చు తప్ప మరింకేమిటి ఉండదు. ఇప్పటికే ఈ కేసు విషయంలో రాష్ట్ర హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సుమారు 7 కోట్ల వరకు ఖర్చు పెట్టింది. ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే దానికి రెండింతలు అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే సుప్రీం కోర్టు లాయర్ లో గంటకు ఇంత చొప్పున ఫీజులు వసూలు చేస్తారు. అంటే సుప్రీం కోర్టు దీనిని ఏమైనా అత్యవసర కేసు కింద పరిగణిస్తే.. తక్కువ వాయిదాలతోనే సరి పోతుంది లేకుంటే మాత్రం తడిసి మోపెడు అవ్వడం ఖాయం. చివరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించే అవకాశాలు ఉండవు. మిగిలేది ఆఖరుకు 0 మాత్రమే…

 

author avatar
Comrade CHE

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju