Unguturu(West Godavari): చేబ్రోలు జాతీయ రహదారిపై ఉంగుటూరు మండలంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు చెట్టుకు ఢీకొన్న ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే ..
తాడేపల్లిగూడెం హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జానకీరామ్ తన భార్యతో కలిసి కడప సమీపంలోని అనంతరాజు పేట కళాశాల భవన ప్రారంభోత్సవానికి వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా, డ్రైవర్ నిద్రమత్తులో చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో జానకి రామ్ భార్య అక్కడికక్కడే మృతి చెందగా, ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
తీవ్రంగా గాయపడిన వైస్ ఛాన్స్ లర్ జానకీరామ్ ను తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ ను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Anantapur: అనంతలో మెగా గృహా ప్రవేశాలు