Yanamala ramakrishnudu: ఏపి ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన రెడ్డి నేడు ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన పై ప్రభుత్వం చెబుతున్నది అంకెల గారిడీనే ఆయన అన్నారు. ఇంటికో ఉద్యోగం అని మాట తప్పారని అన్నారు. ఉద్యోగాల నియామాకలపై పారదర్శకత ఉంటే ఫోన్ నెంబర్లు, వివరాలు వెబ్ సైట్ లో పెట్టాలని సూచించారు. 15 రోజుల క్రితం 4.77 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పుకున్న ప్రభుత్వం ఇప్పుడు 6.03 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించుకున్నారని ఈ పదిహేను రోజుల్లోనే లక్షా 25వేల ఉద్యోగాలు ఇచ్చేశారా అని యనమల ప్రశ్నించారు.
Read More: AP CM YS Jagan: నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్..! మెరిట్ ఆధారంగానే నియామకాలు..!!
రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల పైచిలుకు ఉద్యోగ ఖాళీలు ఉంటే కేవలం పది వేల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఆర్టీసీ ని ప్రభుత్వం విలీనం చేసి 50 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చినట్లు బోగస్ లెక్కలు చూపుతున్నదని అన్నారు. కరోనా సమయంలో మూడు నెలల కోసం తీసుకున్న 26 వేల మంది తాత్కాలిక సిబ్బందిని కూడా ఉద్యోగులుగా చూపడం విడ్డూరంగా ఉందని యనమల విమర్శించారు. రాష్ట్రంలో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగాలకు ఎదురుచూస్తుంటే కేవలం పది వేల ఉద్యోగాలకు క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని అన్నారు.