YCP : వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి YS Jagan monah reddy బీఫామ్లు అందజేశారు. ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు సీ రామచంద్రయ్య, ఇక్బాల్, కరీమున్నీసా, బల్లి కళ్యాణ చక్రవర్తి, చల్లా భగీరథ, దువ్వాడ శ్రీనివాస్లు తాడేపల్లిలోని జగన్ నివాసానికి చేరుకోగా వారిని జగన్ అభినందించి బీఫామ్ లు అందజేశారు. అనంతరం వారు అసెంబ్లీకి వెళ్లి శాసనమండలి కార్యదర్శి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
ఏపిలో ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు గానూ గత నెల 18వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మార్చి 15వ తేదీ పోలింగ్ నిర్వహించనున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు గానూ నేడు నామినేషన్ల స్వీకరణ తుది గడువు కాగా రేపు నామినేషన్ల పరిశీలన, 8వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇచ్చింది. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నిక వైసీపీకి లాంఛన ప్రాయమే.