అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి నివాసంలో విషాదం నెలకొంది. ఆయన అల్లుడు మంజునాథరెడ్డి మృతి చెందారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం లోని కుంచనపల్లిలోని తన అపార్ట్ మెంట్ లో ఆయన మరణించారు. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం హసనాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని పప్పిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు, పిఎంఆర్ కన్స్ స్ట్రక్షన్స్ యజమాని మహేశ్వరరెడ్డి కుమారుడైన మంజునాథరెడ్డికి నాలుగేళ్ల క్రితం కాపు రామచంద్రారెడ్డి కుమార్తెతో వివాహం అయ్యింది. ఆయన భార్య స్రవంతి వైద్యురాలు.
కాంట్రాక్ట్ పనులు నిర్వహించే మంజునాథరెడ్డి .. భార్య తో కలిసి కుంచనపల్లిలోని అవంతి అపార్ట్ మెంట్ లో నివశసిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆయన మరణించినట్లు తెలిసింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. మూడు రోజుల క్రితం అపార్ట్ మెంట్ కు వచ్చిన మంజునాథ రెడ్డి .. శుక్రవారం శవమై కనిపించారు. మంజునాథరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే మంజునాథరెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు లేని మంజునాథరెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గత కొంత కాలంగా ఆయన మానసిక ఒత్తిడితో ఉన్నారని బంధువులు చెబుతున్నారు.
విషయం తెలిసిన వెంటనే మంజునాథరెడ్డి తండ్రి మహేశ్వరరెడ్డి తాడేపల్లికి చేరుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు, అప్పుల ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మంంజునాథరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?