YCP MLA: ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే నిత్యం ప్రజల్లో ఉంటారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా తెలుసుకుంటూ ఉంటారు. సమస్యలపై అక్కడికక్కడే అధికారులకు అక్షింతలు, ఆదేశాలు జారీ చేస్తుంటారు. అటువంటి ఎమ్మెల్యే తాజాగా ప్రభుత్వ పథకంపై సంచలన కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. చిన్న సన్నకారు రైతుల ఉపయోగార్ధం ప్రభుత్వం జలకళ పథకాన్ని ప్రవేశం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ప్రభుత్వం సొంత ఖర్చులతో బోరు బావులు వేస్తుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
YCP MLA: ఈ పథకమే తప్పు
అయితే ఈ పథకంలో కొన్ని లోపాలు ఉన్నాయి. రెండున్నర ఎకరాలు ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు. ఒకే రైతుకు అంత భూమి లేకపోతే ఇద్దరు ముగ్గురు రైతులు గ్రూపుగా ఏర్పడి ఈ పథకం కింద లబ్ది పొందవచ్చు. అయితే నీరు పడినా పడకపోయినా నిర్దేశించిన అడుగులు మాత్రమే బోరు వేస్తారు. దీంతో ఈ పథకం వల్ల ఎక్కువ మంది లబ్దిపొందలేకపోతున్నారు. ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో సత్యసాయి జిల్లా ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి జలకళ పథకమే తప్పని వ్యాఖ్యానించడం సంచలన అంశం అయ్యింది. ధర్మవరం మండలం సుబ్బారావుపేటలో ఆయన గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో రైతులతో మాట్లాడారు.
ఈ సందర్భంలో మల్లీశ్వరి అనే మహిళా రైతు జలకళ బోరు సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చారు,. తమ వ్యవసాయ భూమిలో జలకళ పథకం కింద బోరు వేశారనీ, కానీ ఇప్పటి వరకూ విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదని ఎమ్మెల్యేకు తెలియజేశారు. దీనిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ అసలు ఈ పథకం కింద ఎంత మందికి బోర్లు వేయాలి, ఎంత లోతు వేయాలి అనేది తమకే అర్ధం కావడం లేదని అన్నారు. అసలు ఈ పథకమే తప్పని అన్నారు. ఒకరికి బోరు వేసి ఒకరికి వేయలేని దుస్థితి తలెత్తుతోందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడటంతో అక్కడ ఉన్న వారు ఆశ్చర్యానికి గురైయ్యారు.