YCP MLA RK Roja: ఏపిలో జిల్లాల పునర్విభజన అంశం అధికార పార్టీ నేతలను ఇబ్బందులు పెడుతోంది. జిల్లాల పునర్విభజన ప్రజా ప్రతినిధులు, ప్రజల అభీష్టం మేరకు జరగలేదనీ విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరిగాయి. ప్రభుత్వానికి తమ అభ్యంతరాలు తెలియజేస్తున్నారు. అధికార పార్టీ నేతలపైనా ప్రజల నుండి ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చిత్తూరి జిల్లా నగరి నియోజకవర్గ సమస్యపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందించారు. మొత్తం నగరి నియోజకవర్గాన్ని తిరుపతి కేంద్రంగా ఏర్పడుతున్న బాలాజీ జిల్లాలో కలపాలని ఆర్కే రోజా కోరుతున్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కలిసి వినతి పత్రం ఇస్తానని ఇప్పటికే రోజా పేర్కొన్నారు.
Read More: YS Jagan: సినీ నటుడు ఆలీకి నామినేటెడ్ పోస్టు ఖాయం చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్..!ఇదిగో ప్రూఫ్..!!
YCP MLA RK Roja: సీఎస్ సమీర్ శర్మ వినతి పత్రం
అయితే అనూహ్యంగా ఎమ్మెల్యే ఆర్కే రోజా గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మను కలిసి దీనిపై వినతి పత్రం ఇచ్చారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటు చేయబోయే బాలాజీ జిల్లాలో కలపాలని సీఎస్ ను రోజా కోరారు. బాలాజీ జిల్లా కేంద్రం తిరుపతితో నగరి నియోజకవర్గ ప్రజలకు ఉన్న అనుభంధాన్ని ఆమె వివరించారు. తిరుపతి నగరానికి తొమ్మిది కిలో మీటర్ల దూరంలోనే నగరి నియోజకవర్గం ప్రారంభం అవుతుందని, నగరి నియోజకవర్గం అంతా తిరుపతికి వెళ్లే జాతీయ రహదారికి ఆనుకునే ఉందని తెలిపారు. నగరి నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, మండలాలు తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీకి ఆస్తి పన్ను చెల్లింపులు జరిగాయని రోజా వెల్లడించారు.
స్థానిక సంస్థల తీర్మానాలతో
ఇప్పటికీ పుత్తూరు, నగరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బాలాజీ జిల్లా పేరు మీదనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని రోజా సీఎస్ సమీర్ శర్మకు వివరించారు. తిరుమల శ్రీవారికి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల్లో వినియోగించే గొడుగులు చెన్నై నుండి నగరి నియోజకవర్గం మీదుగానే వెళతాయన్న సెంటిమెంట్ ను ఈ సందర్భంగా గుర్తు చేశారు రోజా. అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏమిటంటే.. నగరిని బాలాజీ జిల్లాలో చేర్చాలంటూ నియోజకవర్గంలోని మండలాలు, పురపాలక సంఘ కార్యవర్గాలు చేసిన తీర్మాన ప్రతులను కూడా ఎమ్మెల్యే రోజా సీఎస్ సమీర్ శర్మకు అందజేశారు. ఇలా స్థానిక సంస్థల తీర్మానాలతో వినతి పత్రం అందజేయడంతో ప్రభుత్వం తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.