YCP MLA Roja: రాజకీయాల్లో ఉన్న వాళ్లకు తనకు పదవి రాకపోయినా ఫరవాలేదు కానీ తన ప్రత్యర్ధికి పదవి వస్తే భరించలేరు. సహించలేరు. ప్రస్తుతం వైసీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పరిస్థితి అది. రాబోయే మంత్రి వర్గంలో పదవి వస్తుందని ఆమె ఆశిస్తున్నారు. ఆ పదవి వస్తుందో రాదో తెలియదు కానీ తన నియోజకవర్గంలో స్వపక్షంలో విపక్షంగా ఉన్న నాయకుడికి మంచి పదవి వరించింది. ఇది ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. గత కొంత కాలంగా నియోజకవర్గ వైసీపీలో రోజా పరిస్థితి ఇబ్బంది ఇబ్బందికరంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. పార్టీ ఒక వర్గం ఆమె నాయకత్వాన్ని దిక్కరిస్తూ ఉన్నారు. ఆ దిక్కార స్వరం వినిపించే నాయకులకే పార్టీ పెద్దలు, ప్రభుత్వ పెద్దల మద్దతు ఉన్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి.
Read More: Nandamuri Balakrishana: రాజీనామాకైనా సిద్ధమంటూ బాలయ్య సంచలన కామెంట్స్ ..
YCP MLA Roja: శ్రీశైలం దేవస్థానం చైర్మన్ గా చెంగారెడ్డి చక్రపాణి రెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో చెంగారెడ్డి చక్రపాణి రెడ్డి, రోజాకు మద్య విభేదాలు తీవ్రమైయ్యాయి. నగరి నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేపట్టినా చక్రపాణి రెడ్డి వేరేగా చేపడుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆయనకు ప్రభుత్వం శ్రీశైలం దేవస్థానం చైర్మన్ గా నియమించింది. ఈ మేరకు నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. నియోజకవర్గ ఎమ్మెల్యే గా ఉన్న తనను సంప్రదించకుండానే తనకు వ్యతిరేకంగా పని చేస్తున్న నాయకుడికి పదవి రావడంపై ఆమె అగ్గిలంమీద గుగ్గిలం అవుతున్నారుట. రోజాపై చక్రపాణి రెడ్డి ఇంతకు ముందు బహిరంగ సవాల్ కూడా చేశారు. వచ్చే ఎన్నికల్లో తన మద్దతు లేకుండా ఎలా గెలుస్తావా చూస్తానంటూ చక్రపాణిరెడ్డి సవాల్ విసిరారు.
అవసరమైతే తన పదవికి రాజీనామా..?
ఈ నేపథ్యంలో చక్రపాణిరెడ్డికి అత్యంత ప్రతిష్టాత్మక ఆలయం అయిన శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి ఆయనకు ఇవ్వడంపై రోజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. సీఎం జగన్ వద్దకు వెళ్లి తన నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉందని అంటున్నారు. అవసరమైతే తన పదవికి రాజీనామా చేస్తానని కూడా రోజా తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించిందని వార్తలు వినబడుతున్నాయి. వైసీపీలో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్న రోజా మాటలు పార్టీ అధిష్టానం వద్ద పారడం లేదని అనుకుంటున్నారు. చూడాలి ఏమి జరుగుతుందో..