YCP MLA Thippeswamy: సత్యసాయి జిల్లా మడకశిర వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి కారు కర్ణాటకలో ప్రమాదానికి గురైంది. కర్ణాటకలోని కోలారు జిల్లా మళబాగిలు వద్ద ఎమ్మెల్యే కారును ఓ మినీ ట్రాక్టర్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతిన్నది. ఎమ్మెల్యే కారు ప్రమాదం వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వైసీపీ శ్రేణులు, నియోజకవర్గ ప్రజలు ప్రమాదంలో ఎమ్మెల్యేకి ఏమైందోనని ఆందోళన చెందారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే తిప్పేస్వామి ఓ మీడియాతో ప్రమాదంపై క్లారిటీ ఇచ్చారు. తాను క్షేమంగా ఉన్నానని చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో తాను కారులోనే లేనని తెలిపారు. తనను బెంగళూరులో డ్రాప్ చేసి డ్రైవర్ తిరుపతికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, తాను క్షేమంగా ఉన్నట్లు ఓ మీడియాతో తెలిపారు తిప్పేస్వామి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?