YS Jagan : వైసీపీ రెబల్ ఎంపి రఘు రామ కృష్ణం రాజు గత కొన్ని నెలలుగా నిత్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటీవల రఘు రామ కృష్ణం రాజుపై సీబీఐ.. బ్యాంకు రుణాలకు సంబంధించి తాజాగా మరో కేసు నమోదు అయ్యింది. ఈ పర్యవసానమో ఇంకేమైనా కారణమో తెలియదు కానీ వైఎస్ జగన్ పై రఘురామకృష్ణం రాజు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటి వరకూ విమర్శలు, ఆరోపణలకు మాత్రమే పరిమితమైన రఘురామ కృష్ణంరాజు తాజాగా నేడు వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం విశేషం. జగన్ బెయిల్ ఎప్పుడైనా రద్దు అవ్వవచ్చు అంటూ బీజేపీ నేత సునీల్ థియోధర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజుల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈ సందర్భంగా రఘు రామ కృష్ణం రాజు డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జగన్ పై ప్రతిపక్షాల నుండి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పార్టీపైన, జగన్ పైనా ఉన్న అభిమానంతోనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు.
తమిళనాడులో జయలలిత, బీహార్ లో లాలూ ప్రసాద్ మాదిరిగా స్టాండ్ బై ముఖ్యమంత్రిని ఎవరినైనా పెట్టుకుని జగన్ కేసుల ట్రయిల్ ఎదుర్కోవాలని రఘు రామ కృష్ణం రాజు సూచించారు. మహారాష్ట్రలో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న హోంమంత్రి తన పదవికి రాజీనామా చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 11 సీబీఐ చార్జిషీట్ లలో జగన్మోహనరెడ్డి ఏ 1గా ఉన్నారని రఘు రామ కృష్ణం రాజు పేర్కొన్నారు. సీఎంగా ఉండటం వల్ల కోర్టు వాయిదాలకు జగన్ హజరు కాలేకపోతున్నారని అన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?