టీడీపీ అనుకూల మీడియాపై మరో సారి ఫైర్ అయ్యారు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి. విశాఖ, బాపట్ల, పుట్టపర్తిలో వైసీపీ కార్యాలయాల నిర్మాణాలకు ప్రభుత్వ భూములను లీజు పద్దతిపై కేటాయించడంపై టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారం చేయడంపై విజయసాయి మండిపడ్డారు. ప్రభుత్వ భూములను లీజ్ పద్దతిలో పార్టీ కార్యాలయాలకు కేటాయించడంలో చట్ట వ్యతిరేకం, అధికార దుర్వినియోగం కాదని ఆయన పేర్కొన్నారు. గతంలో ఉమ్మడి ఏపిలో కాంగ్రెస్, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో అనేక రాజకీయ పార్టీలకు ప్రభుత్వ స్థలాలను కేటాయించారని గుర్తు చేశారు. 1997 లో టీడీపీ అధికారంలో ఉండగా, తమ పార్టీ కార్యాలయం కోసం బంజారాహిల్స్ రోడ్ నెం.2లో 33 ఏళ్ల లీజుపై ప్రభుత్వ స్థలం ఇచ్చారని, ఆ స్థలంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరుతో ఉమ్మడి ఏపి టీడీపీ రాష్ట్ర కార్యాలయం నిర్మించారన్నారు.
Covid 19 Cases: హైదరాబాద్, ఇతర తెలంగాణ జిల్లాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయా..?
వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసిఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీకి బంజారాహిల్స్ లోనే రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ స్థలంలోనే ఇప్పుడు కేసిఆర్ రాజకీయ పార్టీ రాష్ట్ర కార్యాలయం నడుస్తొందన్నారు. ఇలా ప్రభుత్వ స్థలాలు సమృద్ధిగా ఉన్న నగరాలు, పట్టణాల్లో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్ధనపై ప్రభుత్వ భూములను కేటాయించడం సర్వసాధారమేనని తెలిపారు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా పాత సంప్రదాయాలు, ఆనవాయితీ అనుసరించి ప్రభుత్వం వైసీపీ కార్యాలయాలకు స్థలాల కేటాయింపు చేస్తుంటే టీడీపీ అనుకూల మీడియా అనవసర రాద్దాంతం చేస్తొందని విజయసాయి విమర్శించారు.
పట్టు నిలుపుకున్న కాకర్ల వెంకట్రామిరెడ్డి .. అప్స ఎన్నికల్లో కాకర్ల ప్యానల్ ఘన విజయం
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?