MP Vijaya Sai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవేళ ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీని సందర్శించారు. కాశీ క్షేత్రంలోని శ్రీవిశ్వనాధుడిని దర్శించుకుని పూజలు చేశారు. కాశీ విశ్వనాధుడిని దర్శించుకున్న సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ .. కాశీ క్షేత్రంలో విశ్వనాధుడిని దర్శించి, సేవించుకునే మహద్భాగ్యం కలిగినందుకు ధన్యుడినని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. కాశీ క్షేత్ర కారిడార్ ను అద్భుతంగా తీర్చిదిద్దడంలో ప్రధాని మోడీ చేసిన కృషిని ప్రశంసించారు. గత కొద్ది నెలలుగా సైలెంట్ గా ఉన్న విజయసాయి రెడ్డి వైసీపీలో మళ్లీ యాక్టివ్ అవుతున్నారు.
ఇంతకు ముందు ట్విట్టర్ వేదికగా టీడీపీ, చంద్రబాబును తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే వారు. అయితే కొద్ది నెలలుగా విజయసాయి సోషల్ మీడియా అకౌంట్ లో అటువంటి విమర్శల దాడి నిలిచిపోయింది. కొద్ది రోజుల నుండి టీడీపీపై విమర్శలు మొదలు పెట్టినా అంత ఘాటుగా, జుగుస్పాకరంగా లేకుండా సోలోగా కామెంట్స్ చేస్తున్నారు విజయసాయిరెడ్డి. వైసీపీలోనూ ఆయన క్రియాశీలకంగా మారుతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి.