Vijayasai reddy: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా కృష్ణపట్నం అనందయ్య మందు, పత్తిపాటి పుల్లారావు భూ ఆక్రమణ అంశాలను ప్రస్థావిస్తూ తీవ్ర స్థాయి వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి.
“నలుగురు ఎవరి గురించైనా అభిమానంగా చర్చించుకుంటున్నా, మీడియాలో హడావుడి కనిపించినా బాబు వక్ర దృష్టి అటు పడుతుంది. అందులోకి ఎలా దూరాలా అని ఆలోచిస్తాడు. ఇప్పుడు ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య క్రెడిట్ ను ఎలా కొట్టేయాలా అని స్కెచ్ వేస్తున్నాడు గుంట నక్కలా” అంటూ ట్విట్ చేశారు.
అదే మాదిరిగా హైదరాబాద్ జూబ్లి హిల్స్ లో పత్తిపాటి పుల్లారావు భూ వ్యవహారంపైనా విమర్శలు చేశారు. “నదీనదాలు, కొండలు, ఎడారులా మనకడ్డంకి అన్న శ్రీశ్రీ మాటలను వారు మరోలా అర్థం చేసుకున్నారు. ల్యాండ్ కనిపిస్తే చాలు పచ్చజెండా పాతేశారు పత్తిపాటి పుల్లన్న. జూబ్లీహిల్స్ సొసైటీ బోర్డునే తొలగించి కబ్జా చేసిన వారికి…విశాఖ భూములు ఒక లెక్కా? వైసీపీ వచ్చిన తర్వాత వీరి కబ్జాలకు తెరపడింది” అంటూ వ్యాఖ్యానించారు.
Read more: Nara Lokesh: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లోకేష్ లేఖ ..! ఎందుకంటే..?
చంద్రబాబు హయాంలో కార్పోరేట్ హాస్పిటళ్లను పెంచి పోషేంచేందుకే ఆరోగ్య శ్రీ పనికి వచ్చిందన్న విజయసాయి.. ఈ రెండేళ్లలో సిఎం జగన్ సంజీవనిగా మార్చారన్నారు. 95 శాతం మంది ప్రజలు దీని పరిధిలోకి రావడం, కరోనా, బ్లాక్ ఫంగస్ లను ఆరోగ్యశ్రీలో చేర్చి అందరికీ జగన్ భరోసా కల్పించారని పేర్కొన్నారు.