YCP MP Vijayasai Reddy: వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజుపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ సర్కార్ పై విజయసాయిరెడ్డి తన విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ వివేకా హత్య కేసులో ప్రస్తుతం ఉన్న సాక్షులనైనా కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే ముగ్గురు సాక్షులు చనిపోయారన్నారు. ఇటీవల చనిపోయిన గంగాధర్ రెడ్డి మరణంపై వైసీపీ ఎంపి విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను రఘురామ కృష్ణంరాజు తప్పుబట్టారు. ఏపి ప్రభుత్వం అడ్డదారుల్లో రుణాలు తీసుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు రఘురామ.
ఈ మేరకు 8వేల కోట్ల లిక్కర్ బాండ్లను విడుదల చేసిందన్నారు. మధ్యపాన నిషేదానికి ప్రభుత్వం తూట్లు పొడుస్తొందని విమర్శించారు. 2024 నాటికి సంపూర్ణ మద్యపాన నిషేదం విధిస్తామని వైఎస్ జగన్ ఇచ్చిన హామీని ఈ సందర్భంగా గుర్తు చేశారు రఘురామ. వచ్చే నెల 4న తన నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉందనీ, ఆ కార్యక్రమంలో పాల్గొనాలని భావిస్తున్నాననీ, పాల్గొనేందుకు పోలీసులు అనుకూల వాతావరణం కల్పిస్తే వెళ్తానని చెప్పారు రఘురామ. రఘురామ చేసిన విమర్శలపై విజయసాయి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు.
ఢిల్లీలో కూర్చుని జోస్యాలు చెప్పే నర్సాపురం నక్కకి సిగ్గుంటే రాజీనామా చేసి గెలవాలన్నారు. నాలుగు పచ్చ కుల ఛానల్స్ మైకులు ముందు పెట్టుకుని మొరగడం కాదు, నియోజకవర్గంలో తిరిగితే విగ్గు రాజు కు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుందని అన్నారు విజయసాయి రెడ్డి. “ఎల్లో కుల మీడియా రుచి కమ్మగా, స్వంత పార్టీ రుచి చేదుగా.. నీదేం నోరురా విగ్గుబాబు.. ఓరేయ్ డ్యూప్లికేట్ గాజు.. నీ మీసాలైనా ఒరిజినలేనా లేక పీకి అంటించుకున్నావా ..?వాటిని మెలి తిప్పడం ఎందుకురా..? అడగకుండానే నియోజకవర్గం వదిలి అజ్ఞాతవాసం, అరణ్యవాసం చేసే ఏకైక రాజు.. విగ్గురాజు, పెగ్గురాజు..! బూజు రాజు లాంటి రాజు..! ఓ పెగ్గు రాజు.. నీ పదవీ నీ విగ్గులాంటిదే.. తీసేస్తే మిగిలేది గుండే ..!” అంటూ విజయసాయి రెడ్డి వరుస ట్వీట్లు చేశారు.
CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…
Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…
Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…
AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…
Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…