వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హ్యాకర్ లు షాక్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కు గురైంది. శుక్రవారం రాత్రి నుంచే పార్టీ ట్విట్టర్ ఖాతా ప్రొఫైల్ ను హ్యాకర్ లు మార్చేశారు. ఇందులో క్రిప్టో కమ్యునిటీ పోస్టులు పెట్టారు. ప్రొఫైల్ పిక్ తో పాటు బయోడేటా వివరాలను మార్చేశారు. ప్రస్తుతం దాదాపు అన్ని రాజకీయ పక్షాలు సోషల్ మీడియాపై ఎక్కువ ఆధారపడిన విషయం తెలిసిందే. వారి పార్టీ కార్యక్రమాలను ప్రమోట్ చేసుకోవడంతో పాడు ఎదుటి పక్షాలపై విమర్శలు చేస్తూ వీడియోలు, కంటెంట్ పోస్టు చేస్తుంటారు. రాజకీయ పక్షాల సోషల్ మీడియా అకౌంట్ లకు లక్షలాదిగా ఫాలోవర్ లు ఉంటుంటారు. గత కొంత కాలంగా జాతీయ స్థాయి నేతల ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్ లు హాకింగ్ గురైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి, అక్టోబర్ నెలలో టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారు. ఆ సమయంలో వైసీపీపై ఆరోపణలు చేశారు.
.
తాజాగా వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కు గురైంది. ఖాతాను పునరుద్దరించేందుకు వైసీపీకి చెందిన సాంకేతిక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం రాత్రి నుండే వైసీపీ ట్విట్టర్ ఖాతాలో పార్టీకి, ప్రభుత్వానికి సంబంధం లేని పోస్టులు వెలువడ్డాయి. క్రిప్టో కు సంబంధించిన పలు ట్వీట్లు పార్టీ ఖాతాలో ప్రత్యక్షం అయ్యాయి. పార్టీ ఖాతాను హ్యాక్ చేసిన దుండగులు క్రిప్టో కు సంబంధించిన సమాచారాన్ని రీట్వీట్ చేస్తున్నారు. ఎలాన్ మస్క్ ఎన్ఎఫ్టీలు ప్రీగా ఇస్తున్నారని రీ ట్వీట్ చేశారు. ట్విట్టర్ ఎకౌంట్ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఉంచేసిన హ్యాకర్లు .. బయోను మాత్రం ఎన్ ఎప్టీ మిలియనీర్, అమెరికా అని మార్చేశారు.
సజ్జల: షర్మిల కోసమా..! కేసిఆర్ కోసమా..! ఈ మౌనం వెనుక అర్ధం ఏమిటి..?