YCP Vs BJP: గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో వైసీపీ, బీజేపీ తీరు తీస్తుంటే అబ్బో ఇక ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది, కేంద్రంలోని బీజేపీ కూడా జగన్ సర్కార్ పై సీరియస్ గా ఉంది. ఇక జగన్ సర్కార్ కు రోజులు దగ్గర పడ్డాయి అన్నట్లుగా నేతల మాటలు ఉంటాయి. ఈ వార్తలకు ఊతం ఇచ్చేలా వైసీపీ మంత్రులు మాట్లాడటం, దానికి ఏపి బీజేపీ నేతల కౌంటర్ ఇవ్వడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ఇక్కడ ఏపిలో బీజేపీ, వైసీపీ నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటారు. చూస్తే బీజేపీకి, వైసీపీకి ఏ మాత్రం పొసగడం లేదు అన్న భావన కల్గించేలా ఉంటాయి. అటు ఢిల్లీ స్థాయిలో చూస్తే బీజేపీ, వైసీపీ పరస్పర సహకారం, దోస్తాన్ కనబడుతూనే ఉన్నాయి.
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఇటీవలే పీఎసీ సభ్యుడుగా ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. మరో పక్క కేంద్ర కేబినెట్ లో వైసీపీ చేరనున్నందంటూ సోషల్ మీడియాలో ప్రచారం, దానికి ఊతం ఇచ్చేలా విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు రావడం తెలిసిందే. విజయసాయి రెడ్డి ఇటీవల బీజేపీ తమను కేంద్ర మంత్రివర్గంలోకి ఆహ్వానించిందని వెల్లడించారు. అంటే వైసీపీని కేంద్రంలోని బీజేపీ మిత్ర పార్టీగా భావిస్తున్నట్లేగా. ఇదిలా ఉంటే ఏపిలో బీజేపీపై వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శించడం, దీనికి ప్రతిగా బీజేపీ కూడా ఘాటుగా కౌంటర్ లు ఇవ్వడం కనబడుతోంది.
వీటికి తోడు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండించడంతో పాటు రౌడీల పార్టీ అంటూ వైసీపీని ఘాటు విమర్శలు చేయడం జరిగింది. కేంద్ర కేబినెట్ లో ఆహ్వానించారని విజయసాయి వ్యాఖ్యానించడంతో ఏపి బీజేపీ ట్విట్టర్ వేదికగా స్పందించింది. “మేము ఆంధ్రప్రదేశ్ లో రౌడీల పర్టీ వైఎస్ఆర్ సీపీతో ఎలాంటి పొత్తుకు ప్రయత్నించ లేదు. దీనికి విరుద్ధంగా, మరో కుటుంబ పార్టీ టీడీపీ గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రజల తరపున ఎలాంటి పోరాటాలు చేయనప్పటికీ వైఎస్ జగన్ గారి ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై అనేక ధర్నాలను నిర్వహిస్తున్నాము” అంటూ బీజేపీ ట్వీట్ చేసింది. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమని పిస్తుంది. ఇక్కడ కుస్తీ .. అక్కడ దోస్తీ అనిపిస్తుంది కదా..!