YCP VS BJP : తిరుపతి ఎన్నికల నేపథ్యంలో వైసీపీ, బీజేపీ నేతల మధ్య ట్వీట్స్ వార్ సాగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందిస్తూ “మీరు వేస్తున్న డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు వస్తే చాలు మన వాడు సీఎం అయిపోతాడన్నట్లు నటిస్తున్నారు. ఎవరి పాత్రలో వారు జీవించండి..చెవిలో క్యాబేజీ పూలు పెట్టండి. జనం మాత్రం మళ్లీ వైసీపీనే దీవిస్తారు” అని విజయసాయి ట్వీట్ చేశారు.
దీనిపై సోము వీర్రాజు కూడా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “మా ఊసు ఎందుకులే విజయసాయి రెడ్డి గారూ..కోర్టుల చెవులో పువ్వులు పెడుతూ బయట మేకపోతు గాంభీర్యంతో తిరుగుతున్నా లోపల గోళ్లు కొరుక్కుంటున్నారంటగా ఆలీబాబా నలబై దొంగలంతా. తిరుపతి ప్రజలకి మేం ఏం ఇచ్చామో చెప్పి క్యాబేజీ పువ్వులు మీకు పంపిస్తాం, బెయిల్ రద్దవగానే కూరకి లోపల ఉపయోగపడతాయి” అంటూ ట్వీట్ చేశారు. ఇంతకూ పవన్ కల్యాణ్ గురించి ఏమన్నారంటే . “మోడీ గారికి పవన్ కల్యాణ్ గారంటే అభిమానం, 2014 ఎన్నికల సందర్భంగా నాడు కాబోయే ప్రధాన మంత్రి మోడీ పవన్ తో కలిసి ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. మోడీ గారిని ఓ సందర్భంలో కలిసినప్పుడు పవన్ గారిని ఎప్పుడూ కూడాజాగ్రత్తగా చూసుకోవాలన్నారు. పవన్ ను గౌరవించాలి, ఆయనను ఈ రాష్ట్రానికి అధిపతిని చేయాలన్న ఆలోచన ఎప్పుడూ పార్టీలో ఉంది, ఇది వంద శాతం వాస్తవమైన విషయం అంటూ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఇటు విజయసాయి, సోము వీర్రాజు ట్వీట్ లపై నెటిజన్ లు రకరకాలుగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
మా ఊసు ఎందుకులే @VSReddy_MP గారూ..!!!
కోర్టులకు చెవులో పువ్వులు పెడుతూ బయట మేకపోతు గాంభీర్యంతో తిరుగుతున్నా లోపల గోళ్లు కొరుక్కుంటున్నారంటగా అలీబాబా నలభై దొంగలంతా.తిరుపతి ప్రజలకి మేం ఏం ఇచ్చామో చెప్పి క్యాబేజి పువ్వులు మీకు పంపిస్తాం బెయిల్ రద్దవగానే కూరకి లోపల ఉపయోగపడతాయి. https://t.co/zBBj1GoOm7
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) March 29, 2021