YSRCP: రక్తదాన రిజిస్ట్రేషన్ లలో వరల్డ్ రికార్డు సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైసీపీ అధినేత, ఏపి సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లోనూ రక్తదాన రిజిస్ట్రేషన్లు పెద్ద ఎత్తున జరిగాయి. లక్షా 30వేల మంది రిజిస్ట్రేషన్లతో ప్రపంచ రికార్డు సృష్టించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంతకు ముందు 72 వేల నిల్వలతో దక్షిణాఫ్రికా పేరిట రికార్డు ఉండగా, ఆ రికార్డును వైసీపీ బద్దలు కొట్టింది. రిజిస్ట్రేషన్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన చల్లా మధుసూధన్ రెడ్డి, సిబ్బందిని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సందర్బంగా అభినందించారు. ఈ రోజు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. రక్తదానం చేయాలనుకున్న వారి కోసం వైసీపీ ప్రత్యేకంగా వెబ్సైట్ కూడా ఏర్పాటు చేసింది. దీంతో లక్షలాది మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు.
Covid 19 Cases: హైదరాబాద్, ఇతర తెలంగాణ జిల్లాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయా..?