YS Avinash Reddy: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇవేళ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సాయంత్రానికి ఆ పిటిషన్ ను ఆయన ఉపసంహరించుకున్నారు. కాగా గతంలో ఇదే కేసులో తనపై కఠిన చర్యలు తీసుకోకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేయగా, పిటిషన్ ను విచారించిన హైకోర్టు .. అరెస్టు చేయవద్దని చెప్పలేమని స్పష్టం చేసింది. అయితే సీబీఐ విచారణ సందర్భంలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని కోర్టు ఆదేశించింది. న్యాయవాది సమక్షంలో విచారణకు కోర్టు నిరాకరిస్తూ విచారణ రూమ్ వరకూ న్యాయవాది వెళ్లవచ్చని చెప్పింది.
అమరావతి కేసులో ఏపి సర్కార్ కు లభించని ఊరట ..
కాగా ఇప్పటి వరకూ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు నాలుగు సార్లు విచారణ జరిపారు. అయితే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసి మరల వెంటనే ఎందుకు ఉపసంహరించుకున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరో పక్క సుప్రీం కోర్టులో వివేకా కేసు పై విచారణ జరుగుతున్నందున సుప్రీం ఆదేశాల తర్వాత ముందస్తు బెయిల్ పిటిషన్ పై నిర్ణయం తీసుకోవచ్చని భావించి ఉపసంహరించుకున్నారని భావిస్తున్నారు. ఇప్పటికే సుప్రీం కోర్టు వివేకా హత్య కేసు దర్యాప్తునకు మరో అదికారిని నియమించాలని సీబీఐకి ఆదేశించింది. ప్రసుతం ఉన్న రామ్ సింగ్ ను కొనసాగిస్తూనే మరో అధికారిని నియమించాలని, కేసు త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణలో సుప్రీం కోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై ధరఖాస్తు చేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
దేశ వ్యాప్తంగా ఫార్మా కంపెనీలపై డీసీజీఐ దాడులు .. 18 కంపెనీల లైసెన్సులు రద్దు