భారత రాష్ట్రపతిగా ఎన్నికైన అనంతరం మొదటి సారిగా రెండు రోజుల పర్యటన నిమిత్తం ద్రౌపది ముర్ము ఏపీకి విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం విజయవాడ రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో ఏపీ సీఎం వైఎస్ జగన్ సతీ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంలో సీఎం సతీమణి వైఎస్ భారతి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రత్యేకంగా బహుమతి అందజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వైఎస్ భారతి పట్టు చీరను గిఫ్ట్ గా అందజేశారు.
బహుమతిని అందుకున్న ద్రౌపది ముర్ము సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో జగన్ దంపతులు ద్రౌపది ముర్ముకు జ్ఞాపికను అందజేశారు. అనంతరం ద్రౌపది ముర్ముకు ఇచ్చిన విందులో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జగన్ దంపతులతో పాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్ రెడ్డి, డీజీపీ కే రాజేంద్రనాథ్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖలో జరిగిన నేవీ డే వేడుకల్లో పాల్గొన్నారు.
తెలుగు భాష గొప్ప తనాన్ని శ్లాషించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము