YS Jagan : నిన్న మున్నటి వరకూ ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరగవని వైసీపీ భావించింది. ప్రభుత్వం సహకరించకపోతే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు పెట్టలేరు. ఏదో రూపంలో కోర్టుకు వెళ్లి నిలుపుదల చేయవచ్చు అని వైసీపీ అనుకున్నది. చివరకు సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికలకు ప్రభుత్వం, వైసీపీ ఒప్పుకోవాల్సి వచ్చింది. ఎన్నికలు అనివార్యం అని తేలిపోవడంతో వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ మంత్రులు ఏకగ్రీవాల పల్లవి ఎత్తుకున్నారు. గ్రామాల్లో ప్రజలు అందరూ ఒక తాటికి పైకి వచ్చి ఎన్నికలకు పోకుండా ఏకగ్రీవాలు చేసుకోండి అంటూ పిలుపు నిచ్చారు. ప్రభుత్వం కూడా ఏకగ్రీవ పంచాయతీలకు నగదు ప్రోత్సాహకాలను పెంచుతూ జీవో విడుదల చేసింది. పత్రికా ప్రకటన కూడా ఇచ్చింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల తరుణంలో తనకు సమాచారం ఇవ్వకుండా ఎన్నికల ప్రకటనకు పత్రికలకు ఎలా ఇచ్చారంటూ సమాచార శాఖ కు వివరణ కోరింది.
YS Jagan : ఏకగ్రీవాల పల్లవి ఎందుకు?
ఇదిలా ఉంటే అధికార వైసీపీ ఇప్పుడు ఏకగ్రీవాలకు ఎందుకు పట్టుబడుతుంది అన్నది అర్థం కావడం లేదు. ప్రభుత్వ ప్రకటన చూసిన ఎకగ్రీవాలు పంచాయితీలకేనా అసెంబ్లీ ఎన్నికలు కూడా ఏకగ్రీవం చేసుకుంటారా అని ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నెటిజన్ లు. ఎన్నికలకు భయపడటం లేదు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా అత్యధిక స్థానాలు కైవశం చేసుకుంటాం అని ధీమా వ్యక్తం చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ఎందుకు వెనుకడుగువేసి ఏకగ్రీవాల జపం చేస్తున్నారని ప్రజలు వస్తున్నాయి. ప్రభుత్వం తమ ఓటమిని పరోక్షంగా ఒప్పుకుంటోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. బలవంతపు ఏకగ్రీవాలు చేయాలని అధికార పక్షం చూస్తుందంటూ టీడీపీ, బీజెపీ, జనసేన తదితర పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ తరుణంలోనే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకగ్రీవాలపైనా దృష్టి పెడతామని ప్రకటించారు.
YS Jagan : పోటీ చేసి గెలిస్తే ఆ మజానే వేరు
దీనిపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సహా పలువురు వైసీపీ నేతలు ఎన్నికల కమిషనర్ తీరును తప్పుబట్టారు. ఏకగ్రీవాలకు నజరానాలు ఇవ్వడం ఎప్పటి నుండో ఉందని, కొత్తగా ఇప్పుడు ఏకగ్రీవాలు కుదరదు అనడం ఏమిటని ప్రశ్నించారు. అయితే దీనిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ వివరణ ఇచ్చారు. ఎకగ్రీవాలను ప్రోత్సహిస్తాము కానీ మరీ ఎక్కువ ఎకగ్రీవాలు అయితే వాటిపై ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు. ప్రలోభాలు, బెదిరింపులతో ఏకగ్రీవాలతో ఏకగ్రీవాలు జరగకుండా చూస్తామన్నారు. ఎన్నికలను నేరుగా ఎదుర్కునే దమ్ము లేకనే ఎకగ్రీవాలు, ప్రోత్సాహకాలు అంటూ ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తున్నదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే పోటీ చేస్తే గెలుపొందే ప్రాంతాల్లోనూ ఏకగ్రీవాలు చేయాలని నేతలు పట్టుబట్టడం ఆ పార్టీ నేతలకే రుచించడం లేదుట. షంషేర్ గా గెలిచే అవకాశం ఉన్నప్పుడు ప్రత్యర్థులను బుజ్జగించడం, బతిమాలుకోవడం దేనికని ప్రశ్నిస్తున్నారు. పోటీ చేసి గెలిస్తే ఉండే మజానే వేరు. అప్ప అంటున్నారు కొందరు.