YS Jagan : రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అస్పష్టత ఉంటుంది. అలాంటి సమయంలో జీవితాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకోవాలంటే ఎంతో దమ్ము ఉండాలి. అలాంటి దమ్మున్న నిర్ణయమే తీసుకున్న వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నమ్మినబంటు అనే పేరున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. సక్సెస్ఫుల్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అనే పేరున్న పీకే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో దీదీని మరోసారి సీఎం చైర్లో కూర్చోబెట్టే బాధ్యత నెత్తికేసుకున్నారు. ఈ సందర్భంలోనే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ కి సంచలన సవాల్ …
పశ్చిమ బెంగాల్ పై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో బెంగాల్లో ఒకవేళ బీజేపీ గనక అధికారంలోకి వస్తే.. తాను ప్రస్తుతం చేస్తున్న వృత్తి నుంచి పూర్తిగా తప్పుకుంటానని దీనికి పూర్తిగా భిన్నమైన వృత్తిలోకి వెళ్లిపోతానంటూ పీకే సంచలన కామెంట్లు చేశారు. ఓ ఇంటర్వ్యూలో దీంతో పాటుగా ఆసక్తికర వ్యాఖ్యలు చేవారు. అంతే కాదు బెంగాల్లో వంద సీట్ల కంటే బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటే.. రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తా.. నా సంస్థను కూడా మూసేస్తానంటూ స్పష్టం చేశారు. తృణమూల్ తనంతట తాను బలహీనపరుచుకుంటే తప్ప… బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని వ్యాఖ్యానించారు.
అధికార పార్టీపై హాట్ కామెంట్స్…
తృణమూల్ కాంగ్రెస్ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ వలసలపై స్పందిస్తూ…ఆ పార్టీలో అంతర్గత విభేదాలు పుష్కలంగా ఉన్నాయన్న ఆయన.. ఆ లొసుగులను బీజేపీ వాడుకుంటోందని విశ్లేషించారు. బీజేపీ వ్యూహంలో భాగంగానే తృణమూల్ నుంచి బీజేపీకిలో వలసలు సాగుతున్నాయని.. అనేక కారణాలతో నేతలను బీజేపీ వాళ్లు బెదిరిస్తున్నారని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ ఈ సమస్యలను పరిష్కరించుకుంటే బెంగాల్లో తృణమూల్ తిరిగి అధికారం సొంతం చేసుకోవడం పెద్ద విషయమేమీ కాదన్నారు.