YS Jagan : ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. ఏపీ ప్రజల మనసులు గెలుచుకునేలా రాష్ట్ర ప్రయోజనాల కోసం గలం విప్పారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా విషయంలో జగన్ వైఖరి దీన్ని తేటతెల్లం చేస్తుందని వివరిస్తున్నారు. ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 6 వ సమావేశం జరిగిన సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్ నుంచి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనగా పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, అప్పుడే రాష్ట్రం పారిశ్రామికాభివృద్ధిని సాధిస్తుందని జగన్ తన వైఖరిని తేల్చిచెప్పారు .
దటీజ్ జగన్ YS Jagan …
స్పెషల్ స్టేటస్తో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నీతి ఆయోగ్ సమావేశంలో తేల్చిచెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు ప్రత్యేక హోదా ఇస్తారని పార్లమెంట్ లో చెప్పారని గుర్తు చేసిన ఏపీ సీఎం రాష్ట్ర అభివృద్ధికి హోదా ఇవ్వాల్సిందేనని తెలిపారు. పోలవరం విషయంలో సవరించిన అంశాలకు ఆమోదం తెలపాలని కోరారు. అలానే రాష్ట్రంలో 13 మెడికల్ కాలేజీలకు అనుమతులను జగన్ కోరారు.
జగన్ వ్యూహాత్మక వైఖరి …
నీతి ఆయోగ్ సమావేశంలో ప్రత్యేక హోదా అంశంపై జగన్ ప్రస్తావించడం వ్యూహాత్మక అంశమని పలువురు విశ్లేషిస్తున్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోడీ సమక్షంలో కీలకమైన నీతి ఆయోగ్ వేదికగా ఉన్నతాధికారుల సమక్షంలో ఈ విషయాన్ని ప్రస్తావించడం ద్వారా ఏపీకి ప్రత్యేక హోదా ఎంత అవసరమో వైఎస్ జగన్ తేల్చిచెప్పారు.