YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా కలకలం కొనసాగుతున్న సమయంలో తీసుకుంటున్న గొప్ప మానవతా హృదయం ఉన్న నిర్ణయాలు ఏపీ ప్రజల మదిలో నిలిచిపోతున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. సమస్యను గుర్తించిన తక్షణహే వాటిని పరిష్కరించేందుకు వైఎస్ జగన్ వెలువరిస్తున్న ఆదేశాలే ఇందుకు కారణం. కరోనా కలకలానికి తోడుగా వచ్చి `బ్లాక్ ఫంగస్` భయాందోళనల సమయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
బ్లాక్ ఫంగస్ కలకలం…
కరోనా వైరస్ శరీరం నుంచి ఊపిరి తిత్తులకు చేరి తీవ్రమైన ఇబ్బందులు పెడుతోంది. అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ఇలా ఓ వైపు కరోనాతో అవస్థలు పడుతుంటే దానికి తోడు ఇప్పుడు బ్లాక్ ఫంగస్ మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. అయితే ఈ బ్లాక్ ఫంగస్ కేసులు ఏపీలోనూ కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్ ఫంగస్ సోకిన వారికి ఆరోగ్య శ్రీ పరిధిలో ఉచితంగా వైద్యం చేయాలని ఏపీ సిఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. బ్లాక్ ఫంగస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఇప్పటికే ఆ నిర్ణయం కూడా…
ఇదిలాఉండగా, ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. కోవిడ్ మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు చొప్పున ఆర్థికసాయం అందించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి సంబంధించి ఏపీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు అధికారాలు మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొవిడ్ నియంత్రణ, సహాయ చర్యలకు కేటాయించిన నిధుల నుంచి ఈ ఆర్థికసాయం అందజేయాలని కలెక్టర్లకు సూచించారు.