ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఢిల్లీ పర్యటన కి అంతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పర్యటనలో ప్రధాని మోడీ తో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో మరికొంతమంది కేంద్ర మంత్రులతో జగన్ సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం ఘటనలో అదేవిధంగా టిడిపి బిజెపి పార్టీ ల పాత్రలు ఈ ఘటనలో బయటపడటంతో సిఐడి నివేదిక ప్రధాని మోడీ , హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో జగన్ ఉన్నట్లు టాక్.
అంతేకాకుండా జమిలి ఎన్నికలపై కూడా చర్చ జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థికంగా రావలసిన నిధులు గురించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ని కలిసే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా రాష్ట్రంలో కేంద్ర ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయ్యేలా కేంద్ర పెద్దలు నిధులు విడుదల అయ్యేలా చొరవ తీసుకోవాలని జగన్ కోరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి మొదటి తేదీన కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉండటంతో జగన్ ఢిల్లీ పర్యటన ఇటు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారింది.