YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ మరోమారు తన వైఖరిని కుండబద్దలు కొట్టారు. దేశవ్యాప్తంగా కరోనా కలకలం కొనసాగుతున్నట్లే… ఏపీలో కూడా అదే పరిస్థితి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ను కరోనా వ్యాక్సిన్ డోస్ల కొరత వేధిస్తోంది. దీనిపై ఇప్పటికే పలు దఫాలుగా కేంద్రానికి ఏపీ సర్కార్ లేఖలు రాసింది. ఇదే ఒరవడిలో తాజాగా ఏపీ సీఎం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
YS Jagan ఏపీలో ఇది పరిస్థితి…
వాస్తవంగా ఏపీలో మూ రోజుల క్రితమే కోవిడ్ వ్యాక్సిన్ నిల్వలు జీరోకు పడిపోయాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ కోసం ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రానికి 60 లక్షల కోవిడ్ డోసులు కావాలని లేఖలో విఙప్తి చేశారు.. 60 లక్షల డోసులు ఇస్తే 45 ఏళ్లు పైబడిన అందరికీ మొదటి డోసును మూడు వారాల్లో పూర్తి చేస్తామని ప్రధాని రాసిన లేఖలో పేర్కొన్న సీఎం జగన్.. ఒకే రోజులో రాష్ట్రంలో 6, 28, 961 మందికి వ్యాక్సినేషన్ చేశామని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఇదిలాఉండగా, నేడు 6 లక్షల డోసులు రాష్ట్రానికి రానున్నాయి.
లాక్ డౌన్ సంగతేంటి?
మరోవైపు కోవిడ్ 19 నియంత్రణ, నివారణ, కోవిడ్ వాక్సినేషన్పై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎం జగన్ కీలక సూచనలు చేశారు. కోవిడ్ కేసుల మళ్లీ పెరుగుతున్నాయి. వాటిని వెంటనే నియంత్రించాల్సి ఉంది. గత ఏడాది నుంచి జిల్లా యంత్రాంగాలు చాలా బాగా పని చేస్తున్నాయి. కోవిడ్ నియంత్రణలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు మొదలు గ్రామ సచివాలయాల సిబ్బంది వరకు చాలా బాగా పని చేస్తున్నారు. వారి సేవలు ప్రశంసనీయం. ఇప్పుడు మళ్లీ అదే స్ఫూర్తితో తిరిగి పని చేయాల్సిన అవసరం వచ్చిందన్నారు. వాక్సినేషన్ అనేది శాశ్వత పరిష్కారం అని సీఎం జగన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్పై సీఎం వైఎస్ జగన్ స్పందించారు. లాక్డౌన్ వల్ల ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతినగా, ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు.. మళ్లీ ఆ పరిస్థితి రాకూడదు అన్నారు.