ys jagan రాజకీయ నేతల విమర్శలు , ప్రతి విమర్శలు , ఎత్తుగడలకు ఏ మాత్రం తగ్గకుండా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ys jagan , రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ nimmagadda ramesh నిర్ణయాలు ఉన్నాయని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ గురించే ఇదంతా. సుదీర్ఘ ఉత్కంఠ నిర్ణయాల అనంతరం తాజాగా ఏపీ పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పంచాయతీ ఎన్నికలను ఆపాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. అయితే, ఈ తీర్పు ఆధారంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ విరుచుకుపడుతోంది.
గుజరాత్ ప్రస్తావనతో…
వచ్చే ఫిబ్రవరిలో 21, 28 తేదీల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో షెడ్యూలు విడలైంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఏపీ సీఎం జగన్ ను టార్గెట్ చేస్తోంది. ఈ షెడ్యూల్ విషయం ఎపి ప్రభుత్వం, ఉద్యోగు సంఘాల నాయకులు గుర్తించాలని ఆ పార్టీ చెప్తోంది. ఎన్నికలు జరిపితే గుజరాత్ లో రాని కరోనా ఇక్కడ ఎలా వస్తుందో, ఉద్యోగుల ప్రాణాలు ఎలా పోతాయో ప్రజలకు చెప్పాలి అని డిమాండ్ చేస్తోంది.
తీర్పు తర్వాతే జగన్ ( ys jagan ) టీం నిర్ణయం
ఏపీ పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు పూర్తిగా చదివాక స్పందిస్తామని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఎలాంటి అంశాలు పొందుపరిచిందో.. అధ్యయనం చేశాక కార్యాచరణ ఉంటుందని విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ఏపీలో ఎన్నికలు నిర్వహించడానికి ఇది సరైన సమయం కాదని హైకోర్టుకు, సుప్రీం కోర్టు ప్రభుత్వం విన్నవించిందని ఎందుకు ఇప్పుడు ఎన్నికలు వద్దంటున్నామో కూడా కోర్టులకు తెలిపామని ఆయన పేర్కొన్నారు. ఇక సుప్రీం తీర్పుపై అందరితో చర్చించాకే… మాట్లాడతామని ఆయన తెలిపారు.