YS Jagan : ఏపీ ముఖ్యమంత్రి , వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సమస్యలను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారా? ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాల్లో ఉన్న తరుణంలో ఈ మేరకు అస్త్రం ఉపయోగిస్తున్నారా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే.
షర్మిల ఏం చేస్తున్నారు?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఎస్ షర్మిలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లాలో టీడీపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా హాట్ కామెంట్లు చేశారు.సీఎం వైఎస్ జగన్ కుటుంబ వ్యవహారాలను ప్రస్తావించారు. మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దోషి ఎవరో ప్రజలకు తెలుసు అని వ్యాఖ్యానించారు. వైఎస్ షర్మిల పొలిటికల్ ఎంట్రీపై స్పందిస్తూ వైఎస్ షర్మిలకు ఆస్తులు ఇవ్వకుండా.. పదవులు కూడా ఇవ్వకుండ జగన్ మోసం చేశారని ఆరోపించారు. షర్మిల తెలంగాణలో రోడ్డున పడ్డారని చంద్రబాబు కామెంట్ చేశారు.
మళ్లీ జగన్ అవినీతి…
జగన్ అవినీతి వల్లనే అప్పులు పెరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. దేశంలో ఎక్కువగా చేసిన అప్పులు చేసిన సీఎం వైఎస్ జగనే అని చంద్రబాబు మండిపడ్డారు. 22 నెలలో లక్షా 63 వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారన్న ఆయన.. సీఎం జగన్ ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తున్నారు. జగన్ దిగిపోయే నాటికి నాలుగు లక్షల కోట్ల అప్పులు అవుతాయని లెక్కలు కట్టారు.