YS Jagan : ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బ్యాడ్ టైం ఇది. చెప్పాలంటే భరించరాని బాధ. ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా జరుగుతున్న పరిస్థితులు వైసీపీ నేతలనే ఆందోళనకు గురి చేస్తున్నాయి. వైసీపీకి చెందిన ఎమ్మెల్యే గుంతోటి వెంకటసుబ్బయ్య అనారోగ్య కారణంగా కడప పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. వెంకటసుబ్బయ్య మరణం నేపథ్యంలో వైసీపీ బ్యాడ్ టైం గురించి చర్చ జరుగుతోంది.
YS Jagan ఓ వైపు ఉప ఎన్నిక … మరోవైపు మరణం….
వైసీపీకి చెందిన ఎంపీ ఆకస్మికంగా కన్నుమూయడంతో తిరుపతిలో ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికకు వైసీపీ శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి. ఇదే సమయంలో కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య కన్నుమూయడం వైసీపీ నేతలను షాక్ కు గురి చేసింది. ఓ వైపు ఎంపీ కన్నుమూసిన చోట వచ్చిపడిన ఆకస్మిక ఎన్నికల గురించి పార్టీ శ్రేణులు పరేషాన్ అవుతుంటే మరోవైపు ఇక్కడ సైతం అదే పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు.
క్యాన్సర్ వ్యాధితో…
వెంకటసుబ్బయ్య గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారు. కడప పట్టణంలోని అరుణాచల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం 6.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు ఇంటర్మీడియట్ చదువుతుండగా కుమార్తె హేమలత మెడిసిన్ మూడవ సంవత్సరం చదువుతోంది. 2019లో తొలిసారిగా ఎమ్మెల్యే అయినా డాక్టర్ వెంకటసుబ్బయ్య ఆర్థోపెడిక్ సర్జన్ గా గతంలో ప్రజలకు సేవలందించారు. వీరి సతీమణి డాక్టర్ పద్మ కూడా ప్రముఖ డాక్టరుగా కడప పట్టణంలో సేవలందిస్తున్నారు.