YS Jagan CBI case: ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పిటిషన్ పై మంగళవారం హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపి రఘురామకృష్ణం రాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై గతంలో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ కోర్టు జగన్, సీబీఐకి నోటీసులు జారీ చేయగా రెండు వాయిదాల్లోనూ కౌంటర్ దాఖలు చేయలేదు. కౌంటర్ దాఖలునకు జూన్ 1వ తేదీ చివరి అవకాశంగా గత వాయిదా సందర్భంలో సీబీఐ కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో జగన్ తరపున న్యాయవాదులు 98 పేజీల కౌంటర్ దాఖలు చేశారు.
బెయిల్ షరతులను ఉల్లంఘించలేదనీ, సీబీఐని ప్రభావితం చేస్తున్నారన్న పిటిషనర్ వాదనలో నిజం లేదని కౌంటర్ లో జగన్ పేర్కొన్నారు. సీబీఐ కేంద్ర హోంశాఖ పరిధిలో పని చేస్తుందని, రఘురామ కృష్ణంరాజుకు ఈ కేసుతో సంబంధం లేదన్నారు. ఇలాంటి కేసుల్లో థర్డ్ పార్టీ జోక్యం చేసుకోవద్దని గతంలో సుప్రీం కోర్టు తీర్పులు ఉన్నాయని ఈ సందర్భంగా న్యాయవాదులు గుర్తు చేస్తూ రఘురామ పిటిషన్ కు అర్హత లేదని అన్నారు.
Read More: Delhi: మందు ప్రియులకు ఢిల్లీ సర్కార్ గుడ్ న్యూస్
రఘురామ కృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, ఆయనను అనర్హుడుగాప్రకటించాలని స్పీకర్ కు కూడా లేఖ రాశారని జగన్ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. రఘురామ బ్యాంకులను మోసం చేసిన అభియోగాలపై సీబీఐ కేసు నమోదు చేసిందనీ, అదే విధంగా ఆచంట, నర్సాపురం, పెనుగొండ, పెనుమంట్ర, భీమవరం పోలీసు స్టేషన్ లలో ఆయనపై కేసులు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ విషయాలను పిటిషనర్ కోర్టు ముందు దాచారని అన్నారు. వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాల కోసం కోర్టును ఉపయోగించుకోవాలని రఘురామ చూస్తున్నారని కౌంటర్ లో పేర్కొన్నారు. మరో పక్క సీబీఐ కూడా న్యాయస్థానంల మెమో దాఖలు చేసింది. రఘురామ పిటిషన్ పై చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. కోర్టు విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరింది. అనంతరం తదుపరి విచారణను సీబీఐ న్యాయస్థానం ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?