AP Politics : ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కోరుకుని బేల చూపులు చూస్తున్న తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబు కు కోలుకోలేని దెబ్బ వేయాలని జగన్ ప్లాన్ వేస్తున్నారు. ఆయన అనుకున్నది అక్షరాల నిజమైతే చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉండే అవకాశం లేనట్లే. ఇప్పటికే దీనిమీద పూర్తిస్థాయి యాక్షన్ ప్లాన్ను జగన్ సిద్ధం చేశారు.
రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఎప్పుడూ నిలిచి ఉండాలంటే, ఎప్పటికప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉండాలి. దీని వల్ల రాజకీయ వాతావరణం ఏర్పడటంతో పాటు ప్రభుత్వం చేస్తున్న కార్యకలాపాల మీద అంతా ద్రుష్టి ఉండదు. దీంతోపాటు ఇప్పటికీ ఏ ఎన్నికలను ఎదుర్కొనే సత్తా లేక సతమతం అవుతున్న తెలుగుదేశం పార్టీ కు వరుస ఎన్నికలు రావడం ద్వారా ఆ పార్టీ అసలు స్వరూపం ప్రజలకు అర్థం అవుతుంది. ఆ పార్టీని దెబ్బతీసేందుకు అధికార పార్టీ ఆధిపత్యం కొనసాగింది వరుసగా ఎన్నికలు రావడం మంచిదని జగన్ భావిస్తున్నారు.
ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని దెబ్బ తీసిన జగన్ అదే ఊపుతో తిరుపతి ఉప ఎన్నికల్లోనూ భారీ మెజార్టీ సాధించే దిశగా వైఎస్ఆర్సిపి నాయకులకు దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్సిపి కు తిరుపతి లోక్సభ ఎన్నికల్లో భారీ మెజారిటీ రావడం ద్వారా టీడీపీ ఆత్మవిశ్వాసం మీద దెబ్బ తీయడంతో పాటు ప్రజల్లోనూ టీడీపీ పార్టీ తిరోగమనం దశకు చేరుకున్నదీ అని సంకేతం పంపడం జగన్ అభిప్రాయం.
ఇక తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక తర్వాత కూడా ఇదే వేడిని కొనసాగించాలి అన్నది సీఎం ఆలోచన. ఇప్పటికీ టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్, వాసుపల్లి గణేష్ కుమార్, కరణం బలరం లు వైఎస్ఆర్సిపి కు మద్దతు పలుకుతూ అనధికారికంగా వైసిపి సభ్యులు గానీ కొనసాగుతున్నారు. వారితో వారి పదవులకు జగన్ రాజీనామా చేయించలేదు. సమయం వచ్చినప్పుడు దాన్ని వాడుకోవచ్చు అన్నది ముఖ్యమంత్రి భావన. ఆ సమయం ఎప్పుడు వచ్చింది అని జగన్ లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది.
తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక అయిపోగానే ఈ నలుగురి ఎమ్మెల్యే లతో రాజీనామా చేయించి, వెంటనే ఎన్నికలకు వెళ్లాలని జగన్ ముందుగానే అనుకున్నారు. అయితే ఆదివారం కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే మృతి చెందడంతో కచ్చితంగా ఆ ఎన్నికకు నోటిఫికేషన్ రావాల్సి ఉంటుంది. దీంతో ఇదే సరైన సమయం అని భావిస్తున్న జగన్ ఇదే సమయంలో ఆ నలుగురితో కూడా రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లడం ద్వారా రాష్ట్రంలో రాజకీయ అలజడి తగ్గక పోవడం తోడు, అక్కడ విజయం సాధించడం ద్వారా టీడీపీ కి పెద్ద ఝలక్ ఇవ్వాలని సీఎం అనుకుంటున్నారు.
రాజీనామా చేసిన వారు ఖచ్చితంగా గెలిస్తే గాని, పార్టీలోకి రానివ్వనని ముందుగా నిజం చెప్పారు. దీంతో రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ఖచ్చితంగా సర్వశక్తులూ ఒడ్డి విజయం సాధించడం ఖాయం. దీంతో టిడిపి డేంజర్ గేమ్ లోకి వెళ్లడం దాదాపు ఖాయమే. దీంతో పాటు నలుగురు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ సిపి తరపున గెలిస్తే చంద్రబాబు ప్రతిపక్ష హోదా కూడా పోతుంది. సాధారణ సభ్యుడు అలాగే ఆయనకు సభలో మాట్లాడే అవకాశం వస్తుంది. దీంతో శాసనసభలోనూ పైచేయి సాధించవచ్చు అన్నది జగన్ అనుకుంటున్నారు అన్నది వైసీపీ నేతల మాట.
దీని తర్వాత కూడా ఆయన రాష్ట్రంలో రాజకీయ కాకుండా తగు ప్రణాళికలు వేసుకున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు టిడిపిని పూర్తిస్థాయిలో దెబ్బతీయడానికి ఉన్న అన్ని దారులను ఉపయోగించుకుంటూ, చంద్రబాబు ఆలోచనలకు అందకుండా ఆయన రాజకీయ వ్యూహాలు చేయడానికి వీలు లేకుండా చేసి పూర్తిగా వచ్చే ఎన్నికల్లో టిడిపి పోటీ చేయడానికి కూడా భయపడే స్థాయిలో చేయాలి అన్నది జగన్ ముఖ్య ఉద్దేశం.