YS Jagan: ఏపిలో జగన్ సర్కార్ పై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ పరిపాలనలో ఫెయిల్ అయ్యారని ప్రచారం చేస్తున్నప్పటికీ కొన్ని వర్గాల్లో ప్రభుత్వం పట్ల అనుకూలత కనబడుతూనే ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ అధికారంలోకి వస్తుంది అని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇదే సందర్భంలో వైసీపీ వర్గాలు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా మరల వైసీపీనే అధికారంలోకి వస్తుంది అని చెబుతున్నారు. టీడీపీ లెక్కలు టీడీపీకి ఉండగా, వైసీపీ లెక్కలు వైసీపీకి ఉన్నాయి.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
YS Jagan: 90 లేదా 100 స్థానాలు
అయితే వైసీపీ ధీమా ఏమిటి..? మళ్లీ పక్కాగా అధికారంలోకి వస్తామని ఎలాా చెబుతున్నారు..? అంతర్గతంగా వేసుకుంటున్న లెక్క లు ఏమిటి అంటే గతంలో వచ్చిన 151 స్థానాలు రాకపోయినా 90 లేదా 100 స్థానాలు వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు. ఓటింగ్ శాతం కూడా గతంలో మాదిరిగా 49 శాతం రాకపోయినా 44, 45 శాతం మాత్రం తగ్గదు అన్నట్లుగా వైసీపీ భావిస్తొంది. ఇదే సందర్భంలో టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదరదు.ఆ రెండు పార్టీలు వారి బలాన్ని ఎక్కువగా ఊహించుకుని ధీమాకు పోతుండటం వల్ల ఏకాభిప్రాయానికి రారు అని వైసీపీ నమ్ముతోంది. ఆ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్ల చీలిక ప్రభావం వైసీపీకి అనుకూలిస్తుంది అంచనాతో ఉంది. ఒక వేళ టీడీపీ – జనసేన పొత్తుతో ఉంటే వాళ్లను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి. వాళ్లకి ఏయే వర్గాలను పరిమితం చేయాలన్న వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది వైసీపీ. ఈ రకమైన విశ్లేషణ వైసీపీ పెద్దల్లో నడుస్తున్నట్లు సమాచారం.
ఆ వర్గాల్లో సానుకూలత
వైసీపీ అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు ఉంది అంటే .. మహిళల్లో వ్యతిరేకత లేదు. అమ్మఒడి తదితర పథకాల ద్వారా డబ్బులు ఇస్తుండటం వల్ల వాళ్లలో వ్యతిరేకత లేదని చెబుతున్నారు. అలానే గ్రామీణ ప్రాంతాల్లోని కూలీల్లో, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల్లో వైసీపీ పట్ల సానుకూలత ఉంది. అదే విధంగా బీసీల్లోని కొన్ని వర్గాల్లోనూ వైసీపీ పట్ల అనుకూలత ఉంది. వైసీపీ అంచనాలు ఇలా ఉంటే.. బీసీలకు, ఎస్సీలకు గతంలో ఉన్న పథకాలను ఈ ప్రభుత్వం తీసేస్తే వాళ్లలో ఎందుకు అనుకూలత ఉంటుంది వాళ్లు వైసీపీకి వ్యతిరేకమేనని టీడీపీ చెబుతోంది. ఇలా టీడీపీ, వైసీపీ వారి వారి లెక్కల్లో ఉన్నాయి. ఓటర్లు మాత్రం ఎన్నికలకు మూడు నెలల ముందు వరకూ ఎవరికి ఓటు వేయాలి అనేది ఫిక్స్ అవ్వరు. ఇప్పుడు ఎవరు సర్వే చేసినా ప్రజాభిప్రాయం తెలియదు. కొన్ని వర్గాల అభిప్రాయం మాత్రమే వెల్లడి అవుతుంది.