YS Jagan : ఏపీ ముఖ్యమంత్రి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి కొత్త చర్చ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి పదేళ్లు పూర్తయిన సమయంలో ఆయనకు దక్కిన విజయం ఆషామాషీ కాదు. జగన్ పార్టీ దెబ్బకు ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి టీడీపీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. తాడిపత్రి, మైదుకూరులో తప్ప టీడీపీ ఎక్కడ కూడా వైసీపీకి పోటీ ఇవ్వలేకపోయింది. జగన్ సమర్దవంతమైన పాలనకు మునిసిపల్ ఎన్నికల ఫలితాలే ఒక నిదర్శనం. అంతేకాకుండా వైఎస్ జగన్ పై ఇన్నాళ్లు ఓ వర్గం వేసిన మచ్చకు గొప్ప సమాధానం అంటూ వైసీపీ నేతలు అంటున్నారు.
YS Jagan ఏపీ వ్యాప్తంగా…
రాజధాని అమరావతి రగడ జరుగుతున్న ప్రాంతంలో కూడా వైసీపీ దూసుకుపోయింది. గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లలో కూడా వైసీపీ హవా కొనసాగించింది. దీన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పట్ల రాష్ట ప్రజలరందరూ సంతృప్తిగా ఉన్నారని స్పష్టం అవుతుందని చెప్తున్నారు. వైసీపీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో పట్టున్న పార్టీ అని… పట్టణాల్లో అంతా జోరు ఉండదనే అభిప్రాయాలకు ఈ ఫలితాలు చెక్ పెట్టాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తొలి రౌండ్ నుంచి తుది రౌండ్ వరకు వెలువడిన ఫలితాలతో పట్టణాల్లోని అన్ని వర్గాల ప్రజలు తమ మద్దతును స్పష్టంగా చెప్పారని విశ్లేషిస్తున్నారు.
అక్కడ కూడా వైసీపీ గెలుపే…
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పురపాలికలే కాకుండా కీలకమైన అమరావతి ప్రాంతంలోనూ వైసీపీ గెలుపొందింది. రాష్ట్రవ్యాప్తంగా బెజవాడ మేయర్ పీఠంపై భారీ అంచనాలు నెలకొన్న సమయంలో.. పూర్తి ఆధిక్యంతో మేయర్ పీఠాన్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. రెండు రౌండ్లు పూర్తయ్యే సరికే 33 సీట్లతో పూర్తి ఆధిక్యంతో మేయర్ పీఠం వైసీపీ చేజిక్కించుకుంది. బెజవాడ టీడీపీలో గ్రూపు తగాదాలతో ఆ పార్టీ సతమతం అవుతుంటే ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార వైసీపీ.. మంత్రులను ఎమ్మెల్యేలను రంగంలోకి దింపింది. విజయవాడ కార్పొరేషన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అందరి అంచనాలు తారుమారు చేస్తూ వైసీపీకి బెజవాడ వాసులు పట్టం కట్టడంతో అమరావతి ప్రాంతంలో కూడా సీఎం జగన్ కు ప్రజల మద్దతు ఉందనేది స్పష్టమైంది.