YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల కోసం మరో గుడ్ న్యూస్ అందుబాటులోకి తెచ్చింది. మారుమూల గ్రామాలకు చెందిన చిన్న, మధ్యతరహా రైతులకు సైతం ఆర్థిక చేయూతనిచ్చే లక్ష్యంతో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) శాఖలను మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రకటించారు.
ఆ మండలాల్లో…
జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ)లతో రైతులకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు డీసీసీబీల వల్ల సమర్థవంతంగా క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు అవకాశం ఉంటుందని మంత్రి చెప్పారు. డీసీసీబీల ద్వారా ఇప్పటికే మహిళా స్వయం సహాయక సంఘాలు కౌలు రైతులకు అధికంగా రుణాలు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని కన్నబాబు పేర్కొన్నారు. అయితే, రాష్ట్రంలో ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో 343 మండలాల్లో మాత్రమే డీసీసీబీ బ్రాంచ్లున్నాయని, దీనివల్ల ప్రజలకు పూర్తిస్థాయిలో ప్రయోజనాలు దక్కడం లేదన్నారు. అందుకే డీసీసీబీ బ్రాంచులు లేని 332 మండలాల్లో రానున్న మూడేళ్లలో కొత్త బ్రాంచ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
టార్గెట్ పెట్టుకొని మరి…
గుంటూరు జిల్లాలో 20 నూతన బ్రాంచులు, చిత్తూరు జిల్లాలో 10 అదే విధంగా నెల్లూరు జిల్లాలో 4బ్రాంచ్లు ఏర్పాటుకు ప్రతిపాదనలను ఆప్కాబ్ ద్వారా నాబార్డుకు పంపినట్టు మంత్రి కన్నబాబుకు అధికారులు వివరించారు. నూతనంగా బ్రాంచులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్న మండలాల్లో ఈ ఏడాది కనీసం 30 శాతం మండలాల్లో డీసీసీబీ బ్రాంచ్లు ఏర్పాటు చేయాలని మంత్రి కన్నబాబు అధికారులను ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా వాటిని ప్రారంభించాలని మంత్రి కన్నబాబు ఆదేశించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?