YS Jagan : రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్న తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీల అభివృద్ధికి సంబంధించి వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలను కలిపి ఒకే కార్పోరేషన్ గా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరి మున్సిపాలిటీ, దాని పరిధిలోని 11 గ్రామాలు, తాడేపల్లి మున్సిపాలిటీతో పాటు దాని పరిధిలోని 10 గ్రామాలు మొత్తం 21 గ్రామాలు, రెండు మున్సిపాలిటీలు కలిపి కొత్త మున్సిపల్ కార్పోరేషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏపి మున్సిపల్ చట్టం 1994 ప్రకారం కార్పోరేషన్ ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలను కలిపి కార్పోరేషన్ గా ఏర్పాటు చేయాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
ఈ ఏడాది జనవరి నెలలోనే దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వెయ్యి కోట్లతో డీపిఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తాజాగా మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో తాడేపల్లి – మంగళగిరి అతిపెద్ద మున్సిపల్ కార్పోరేషన్ గా అవతరించింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?