YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న తరుణంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షను నిర్వహించారు. ఈ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 104 వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు. 104 కు ఫోన్ చేసిన వెంటనే అవసరం మేరకు బెడ్లను ఇచ్చే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలని వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
ఏపీలో ఇది పరిస్థితి…
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఇక తాజాగా రాష్ట్రంలో 14,986 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,99,694 కేసులు నమోదయ్యాయి. ఇందునో 11,01,536 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,89,367 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 84 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 8791కి చేరింది.
సీఎం జగన్ కీలక రివ్యూ
ఏపీలో కరోనా పరిస్థితిపై రివ్యూ నిర్వహించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ బెడ్లు అవసరం లేని వారిని కరోనా కేర్ సెంటర్లకు పంపాలని, ప్రతి ఆసుపత్రిలో ఆరోగ్య మిత్రను తప్పనిసరిగా అమలు జరిగేలా చూడాలని జగన్ పేర్కోన్నారు. ఇక వ్యాక్సినేషన్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని, కేంద్రం నిర్ణయించిన కోటా మేరకే వ్యాక్సిన్ కొనుగోలు చేయాల్సి ఉంటుందని అన్నారు. ఈ విషయం తెలిసి కూడా కొందరు కావాలని రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.