YS Jagan : ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇటీవల తీసుకున్న ఓ కీలక నిర్ణయం ఒక వైపు రాజకీయ వర్గాల్లో, మరో వైపు అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇంతకూ అదేమిటంటే సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ పీ ఠాకూర్ ను ఆర్ టీ సీ ఎండిగా నియమించడం. గత తెలుగుదేశం ప్రభుత్వం అత్యంత కీలకమైన డీజీపీ పదవిలో ఉన్న ఆర్ పి ఠాకూర్ ను జగన్ అధికారంలోకి రాగానే అప్రధాన్యత శాఖకు బదిలీ చేశారు. ప్రింటింగ్ అండ్ స్టెషనరీ విభాగానికి ఎండిగా అప్పటి నుండి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అనూహ్యంగా ఎవరూ ఊహించని విధంగా ఆయనకు జగన్ సర్కార్ ప్రాధాన్యతా పోస్టుకు బదిలీ చేసింది. ఎన్నికలకు ముందు సీఎం జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడానికి ఏదైనా వ్యాహం ఉందా అని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
జగన్మోహనరెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న సమయంలో విశాఖ ఎయిర్ పోర్టులో ఓ యువకుడు కోడికత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో డీజీపీగా ఉన్న ఠాకూర్ ఈ ఘటనకు వైసీపీ నేతలే కారణమంటూ కూడా వ్యాఖ్యానించారని వార్తలు వచ్చాయి. ఆ నేపథ్యంలో ఠాకూర్ తీరును వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యంతో ఠాకూర్ దూకుడు తగ్గించారు. ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం రాగానే డీజీపీగా ఉన్న ఠాకూర్ ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగానికి బదిలీ చేసింది. ఏడాదిన్నర కాలంగా ఆయన అక్కడ విధులు నిర్వహిస్తుండగా ఇటీవల ఆర్ టీ సీ ఎండిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వానికి అనూకూలంగా ఉంటే ప్రాధాన్యక కల్గిన పోస్టులు ఇవ్వడం జరుగుతుందన్న సంకేతమా లేక ఇందులో ఏంకేమైనా వ్యూహాలు ఉన్నాయా అనేది చర్చనీయాంశం అయ్యింది. అయితే దీని వెనుక ఢిల్లీ స్థాయిలో బ్యూరోక్రాట్ లాబీయింగ్ కూడా నడిచిందని వార్తలు వచ్చాయి. మరో పక్క అధికారుల విషయంలో సీఎం జగన్మోహనరెడ్డి వైఖరి కూడా కొంత మార్పు వచ్చిందని అంటున్నారు