YS Jagan : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలనలో తన మార్కును చాటుతున్నారు. ఇప్పటికే విద్యారంగంలో అనేక మార్పులు తీసుకువచ్చారు. నాడు నేడు పేరుతో పాఠశాలల రూపు రేఖలు మర్చేశారు. అమ్మఒడి పథకం, ఇంగ్లీషు మీడియం విద్యాభోధనతో పాటు సీబీఎస్ఈ సిలబస్ సిలబస్ ఇలా అనేక మార్పులు జరిగాయి. ఇప్పుడు తాజాగా పరీక్షల విధానంలో మార్పులు చేయాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకూ అటానమస్ కళాశాలలో సొంతంగా ప్రశ్నాపత్రాలు తయారు చేసుకునే విధానం ఉండగా దాన్ని రద్దు చేస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నది.
గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ సొంతంగా ప్రశ్నాపత్రాలు తయారు చేసే విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జేఎన్టీయు తయారు చేసిన ప్రశ్నా పత్రాలు అయా కళాశాలలో వినియోగించాలని ఆదేశించారు. నాన్ అటానమస్ కాలేజీలకు ఇవే ప్రశ్నాపత్రాలు ఉంటాయని చెప్పారు. పేపర్ వాల్యూయేషన్ కూడా జేఎన్టీయూకే అప్పగించాలని తెలిపారు.
సీఎం జగన్మోహనరెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంతో అటానమస్ కళాశాలల యాజమాన్యంకు గొంతులో వెలక్కాయ పడ్డట్లు అయ్యింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?