Jagananna Smart Township: అల్పాదాయ వర్గాల వారు రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకోవడం అంటే ఒక కలే. అయితే ఆ కల సాకారం చేసుకునేలా జగన్మోహనరెడ్డి సర్కార్ జగనన్న స్మార్ట్ సిటీ టౌన్ షిప్ పథకాన్ని తీసుకువచ్చింది. ఏపి సీఆర్డీఏ.. మంగళగిరిలోని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం సమీపంలో అమరావతి టౌన్ షిప్ లో ఎంఐజీ లేఅవుట్ల విక్రయానికి చర్యలు చేపట్టింది. ఈ టౌన్ షిప్ లో 600 ప్లాట్ లు అందుబాటులోకి తెస్తున్నారు. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ పథకం లో భాగంగా ఎంఐజీ లే అవుట్లను ఈ నెల 13న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రారంభించనున్నారు.
YS Jagan MIG layouts Jagananna Smart Township
Jagananna Smart Township: వార్షిక ఆదాయం 18లక్షల లోపు వారికే..
ఈ స్మార్ట్ షిప్ ఎంఐజీ లేఅవుట్ నందు 200 చ.గజాల నుండి 240 చ.గజాల వరకూ ప్లాట్లు లభ్యంగా ఉంచినట్లు సీఆర్డీఏ కమిషనర్ విజయకృష్ణన్ ఓ ప్రకటనలో తెలిపారు. కుటుంబ సభ్యుల అందరి వార్షిక ఆదాయం రూ.18 లక్షల లోపు ఉండి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారే కొనుగోలు చేసేందుకు అర్హులని సీఆర్డీఏ స్పష్టం చేసింది. ఆదాయాన్ని దృవీకరించే ఐటీ రిటర్నలు, ఫారం 16, తహశీల్దార్ జారీ చేసిన పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
ధరఖాస్తు సమయంలో విలువలో పది శాతం చెల్లించాలి. ప్లాట్ కేటాయింపు అయిన నెలలోపే ఒప్పందం ఉంటుంది. ఇది జరిగిన నెలలోగా 30 శాతం, ఆరు నెలలకు మరో 30 శాతం, ఏడాదికి కానీ..రిజిస్ట్రేషన్ సమయంలోగానీ మిగిలిన 30 శాతం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. లే అవుట్లకు సంబంధించిన వివరాలను ఏపి సీఆర్డీఏ కమిషనర్ కార్యాలయ పని వేళల్లో కానీ https://migapdtcp.ap.gov.in/, https://crda.ap.gov.in/ వెబ్ సైట్ లో వివరాలు తెలుసుకోవచ్చని కమిషనర్ విజయకృష్ణన్ తెలిపారు.