ఏపీ సీఎం Ys Jagan Mohan Reddy పాలనలో ముందు నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా సంచలనలు కూడా సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా విద్య వైద్య రంగంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు పట్ల ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విద్యా అదే విధంగా వైద్యం చేయించుకునే విషయాల్లో పేదవాడికి ఎటువంటి భారం లేకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు.
Ys Jagan Mohan Reddy సంచలనం గర్భిణీలకు ఇంటివద్దనే పరీక్షలు:-
ఇలాంటి తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా గర్భిణీ మహిళల విషయంలో జగన్ సర్కార్ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే గర్భిణీలకు నేరుగా చికిత్స ఇంటివద్దనే జరిగే రీతిలో వైద్య రంగంలో సరికొత్త మార్పులు జగన్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే వైయస్సార్ క్లినిక్ లు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో.. గర్భిణీలకు ఇంటివద్దనే అన్ని పరీక్షలు చేసేలా వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రాష్ట్ర వైద్య శాఖ అధికారులు వివరించడం జరుగుతుందని సమాచారం.
గర్భిణీ కి సంబంధించి పూర్తి ఆరోగ్య డేట్ ఫైల్:-
అంతేకాకుండా గర్భిణీకి సంబంధించిన పూర్తి ఆరోగ్య డేటా ఫైల్ కూడా మెయింటెన్ చేసే తరహాలో వైద్య బృందం తోపాటు అంగన్ వాడి కేంద్రాలకు అనుసంధానం చేసే విధంగా జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంటున్నట్లు టాక్. మరోపక్క అంగన్ వాడి కేంద్రాలలో కూడా “జగనన్న గోరు ముద్ద” కార్యక్రమాన్ని ప్రారంభించాలని.. ప్రస్తుతం ఇస్తున్న పోషకాహార లతోపాటు మరింత నాణ్యమైన ఆహారాన్ని గర్భిణీలకు మరియు పిల్లలకు అందించే విధంగా జగన్ సర్కార్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే అంగన్ వాడి కేంద్రాలను వైయస్సార్ ప్రీ స్కూల్ సెంటర్లుగా పేరు మార్చి ఆలోచన కూడా చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలలో టాక్. ఏది ఏమైనా వైద్యరంగం విషయంలో వైయస్ జగన్ సర్కారు తీసుకుంటున్న సరి కొత్త నిర్ణయాలు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.