YS Jagan Paris tour: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మరో సారి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఈ నెల 28న సీఎం జగన్ పారిస్ వెళ్లనున్నారు. ఇటీవల వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. దావోస్ పర్యటన అధికారికం కాగా ఇప్పుడు వ్యక్తిగత పని మీద పారిస్ వెళ్లనున్నారు. సీఎం వైఎస్ జగన్ పెద్ద కుమార్తె హర్షారెడ్డి పారిస్ లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ నందు పీజీ చేస్తున్నారు. జూలై 2న స్నాతకోత్సవం (కాన్వొకేషన్) నిర్వహిస్తుండటంతో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జగన్ కుటుంబ సమేతంగా పారిస్ వెళ్లనున్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇన్సీస్ బిజినెస్ స్కూల్ నందు పీజీ చదవడం కోసం హర్షారెడ్డి 2020 ఆగస్టు చివరిలో పారిస్ వెళ్లారు. నాడు హర్షారెడ్డి బెంగళూరు నుండి బయలుదేరి వెళ్లగా, జగన్ దంపతులు వెళ్లి వీడ్కోలు చెప్పి వచ్చారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో డిగ్రీ పూర్తి చేసిన తరువాత హర్షారెడ్డి పారిస్ లోని ఇన్నీడ్ బిజినెస్ స్కూల్ లో పీజీ కోర్సులో చేరారు. హర్షారెడ్డి స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం కర్ణాటక రాజధాని బెంగళూరులో పూర్తి చేశారు.