YS Jagan on Andhra Pradesh Elections 2024: గత ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు 151 సీట్లు వచ్చాయి, వచ్చే ఎన్నికల్లో 175కి 175 సాధించాలన్న లక్ష్యంతో నాయకులు కృషి చేయాలని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో బుధవారం వర్క్ షాపు నిర్వహించారు. మంత్రులు, రీజనల్ కోఆర్డినేటర్ లు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు వర్క్ షాపుకు హజరుకాగా వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గడప గడపకూ అనేది నిరంతరాయంగా జరిగే కార్యక్రమమని అన్నారు. దాదాపు ఎనిమిది నెలల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
YS Jagan: ప్రజల విజ్ఞప్తులపై తక్షణం చర్యలు చేపట్టాలి
ఒక్కో సచివాలయానికి రెండు రోజుల పాటు కేటాయించాలన్నారు. గడప గడపకూ కార్యక్రమాన్ని ఏ విధంగా చేశాం..? ఎలా చేస్తున్నాం..? ఇంకా ఎలా మెరుగుపర్చుకోవాలి..? ఎలా సమర్ధత పెంచుకోవాలని..? అనే విషయాలపై నిరంతరం చర్చించుకోవాలని, అందుకోసం నెలకు ఒక సారి వర్క్ షాపు నిర్వహిస్తామని చెప్పారు. ప్రజా ప్రతినిధుల నుండి ఈ వర్క్ షాపులో సూచనలు, సలహాలు తీసుకంటామన్నారు. గడప గడపకూ కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తులపై తక్షణం పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాబోయే ఎన్నికల్లో 175 కి 175 స్థానాలు సాధించాలన్నది మన లక్ష్యమని జగన్ అన్నారు.
Andhra Pradesh Chief Minister YS Jagan on upcoming Andhra Pradesh Elections Strategy in 2024
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
YS Jagan: కుప్పం మున్సిపాలిటీ లో వైసీపీ గెలుస్తుందని ఎవరైనా అనుకున్నారా..?
పార్టీ, కులం, మతం అనేవి చూడకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు పథకాలు చేరాయని చెప్పారు. సంతృప్తి స్థాయిలో మంచి చేశామని చెప్పుకోగలుగుతున్నామనీ, అందుకే కాలర్ ఎగరేసుకుని ప్రజల్లో తిరుగగలుతున్నామని అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామనీ, కుప్పంలో మున్సిపాలిటీ గెలుస్తామని ఎవరైనా అనుకున్నారా అని ప్రశ్నించారు. ప్రతి నెలా 20 రోజులు గడప గడపకూ నిర్వహించాలనీ, ప్రతి నెలా పది సచివాలయాల్లో నిర్వహించేలా ప్రణాళిక వేసుకోవాలని ప్రజా ప్రతినిధులకు జగన్ సూచించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?